రామాకు ఆఫర్ ఇచ్చిన కన్నబాబు…. కన్నబాబుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రామ!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే…. మరికొన్ని గంటలలో 20 లక్షల డబ్బు కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయాలని కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ఉంటారు. ఇక రామ బయటకు వెళ్ళగా కన్నబాబు నిన్ను పలకరిద్దామని వచ్చాను అంటూ రామాను ఆపి మాట్లాడుతారు.నీ భార్య మాటలు విని మీ తమ్ముడు పేరును అడ్డుపెట్టుకొని 20 లక్షలు అప్పు చేశావట కదా అంటూ వెటకారంగా మాట్లాడతారు.ఊర్లో అందరూ కూడా నీ గురించే మాట్లాడుకుంటున్నారని చెప్పడంతో రామా ప్రస్తుతం మా కుటుంబ పరిస్థితులు బాగాలేవు నువ్వు ఏమి జోక్యం చేసుకోకపోవడమే మంచిది అని చెబుతాడు.

కన్నబాబు మాత్రం రామాని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ జానకి గురించి తప్పుగా మాట్లాడుతాడు. దీంతో రామ కన్నబాబు కాలర్ పట్టుకొని తనకు వార్నింగ్ ఇస్తాడు.ఇక కన్నబాబు మాత్రం మొన్న జానకి మా ఇంటికి వచ్చి నాపై తప్పుడు కేసు పెట్టింది. మాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. అయితే నీకు 20 లక్షలు కావాలంటే నీ భార్యను మా ఇంటికి వచ్చి నా కాళ్లు పట్టుకొని క్షమాపణలు అడగమను నీకు ఇప్పుడే 20 లక్షలు ఇస్తానని చెప్పడంతో రామా మాత్రం తన కాలర్ పట్టుకుని సీరియస్ గా తనకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కన్నబాబు మాత్రం నీ అంత చూస్తా మిమ్మల్ని ఇంకా బాధ పెడతా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.ఇక జ్ఞానంభ నగలు తాకట్టు పెట్టడంతో కేవలం 5 లక్షలు మాత్రమే వచ్చాయని అప్పు ఎలా తీర్చాలి అని బాధపడుతూ ఉంటుంది.

అప్పుడే జానకి వెళ్లి భోజనం తీసుకు రానా అని చెప్పడంతో వద్దని చెబుతారు.రామ ఇంకా ఇంటికి రాకపోయేసరికి జానకి ఎదురు చూస్తూ ఉంటుంది. అదే సమయంలో జెస్సి వెళ్లి భోజనం చేద్దాం రండి అక్క అని పిలవగా నాకు ఇప్పుడు వద్దు జెస్సి రామ గారు వచ్చిన తర్వాత తింటా మీరు వెళ్లి తిని పడుకోండి అని చెబుతుంది లోపలికి వెళ్ళిన జెస్సి ఉమ్మడి కుటుంబం అంటే కేవలం సంతోషాలు మాత్రమే కాదు అఖిల్ బాధలు కూడా పంచుకోవాలి అందరూ ఇల్లు వెళ్లిపోతుందని బాధపడుతుండగా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అంటూ తనని నిలదీస్తుంది.దీంతో అఖిల్ అన్నయ్య చేసిన అప్పుకు నాకు ఏ సంబంధం లేదు అని మాట్లాడటంతో ఇంత సెల్ఫిష్ గా ఎలా ఆలోచిస్తున్నావు అని గొడవపడుతుంది. దాంతో అఖిల్ తనని కొట్టడానికి చేయి పైకెత్తుతాడు ఏం ఆగిపోయావే కొట్టు అనడంతో నా భార్య మనసుని కూడా మా వదిన మార్చేసింది అంటూ జానకిని అపార్థం చేసుకుంటాడు.

మరోవైపు మల్లిక కూడా దొంగచాటుగా భోజనం చేస్తూ ఉంటుంది. అది చూసిన విష్ణు ఇంట్లో ఇంతమంది ఇలా బాధపడుతుంటే ఆ బాధ నీకేం అనిపించలేదా అని మాట్లాడతాడు. దాంతో బావగారు చేసిన అప్పుకు నేనెందుకు బాధపడాలి.నేను తీసుకున్న ఐదు లక్షల గురించే ఆలోచించలేదు ఇక వాళ్ళు అప్పు చేసిన 20 లక్షల గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను అంటూ భోజనం చేస్తుంది.