అఖిల్ కు జాబ్ రావడంతో సంతోషంలో జ్ఞానంభ కుటుంబం…. విషయం తెలిసి షాక్ అయిన జానకి!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా మారింది. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే అఖిల్ ఇంటర్వ్యూకి వెళ్లిన కంపెనీ నుంచి తనకు ఫోన్ రావడమే కాకుండా తనకు జాబ్ వచ్చిందని తనని ప్రాజెక్ట్ మేనేజర్ గా అపాయింట్మెంట్ చేశానని చరణ్ చెబుతాడు.వారంలోగా జాయిన్ కావాలని నెలకు పాతికవేల శాలరీ అని చెప్పడంతో అఖిల్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తాడు.ఇలా తనకు జాబ్ రావడంతో ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. అంతలో విష్ణు మల్లిక సైతం తన జాబ్ గురించి అడిగి తెలుసుకుంటారు.

ఇలా కుటుంబ సభ్యులందరూ సంతోష పడుతూ ఉండగా అదే సమయంలో రామా అక్కడికి వస్తారు. అన్నయ్య నాకు జాబ్ వచ్చింది మొన్న నువ్వు విసిటింగ్ కార్డు ఇచ్చావు కదా అదే కంపెనీలోనే జాబ్ వచ్చింది అని సంతోషపడతారు.ఇక అదే సమయానికి జానకి రావడంతో అఖిల్ కి జాబ్ వచ్చిన విషయాన్ని తెలుసుకొని ఏ కంపెనీలో అని అడిగి తెలుసుకున్నటువంటి జానకి తనకు కంగ్రాట్స్ చెబుతుంది. ఇలా అఖిల్ కి జాబ్ రావడంతో కుటుంబ సభ్యులందరూ చాలా సంతోష పడుతూ ఉంటారు.

ఇక రామా జానకి ఇద్దరు మాట్లాడుతూ చూసారా జానకి గారు అఖిల్ కు జాబ్ రావడంతో అమ్మానాన్నలు ఎంత సంతోషంగా ఉన్నారు అంటూ మాట్లాడటంతో తనకు కూడా చాలా సంతోషంగా ఉందని జానికి చెబుతుంది. అయితే అఖిల్ కు జాబ్ రావడంలో మీ ప్రమేయం ఏమీ లేదు కదా అనడంతో రామ తలుపులు వేసి అఖిల్ జాబ్ కోసం 20 లక్షలు చెల్లించానని తెలిపారు.. అది తెలిసిన జానకి షాక్ అవుతుంది.20 లక్షలు మీకు ఎక్కడిది అని అడగడంతో ఎవరికి తెలియకుండా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టానని రామా చెబుతాడు.

దీంతో జానకి షాక్ అవ్వడమే కాకుండా మీరు మోసపోయారు రామా గారు అని చెప్పినప్పటికీ రామా మాత్రం చరణ్ తన చిన్ననాటి స్నేహితుడని మోసం చేయడని ధీమా వ్యక్తం చేస్తాడు తాను ఈ విషయం వెంటనే అత్తయ్యకు చెబుతానని వెళుతూ ఉండగా రామ తనని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అంతలోపు జ్ఞానంబ ఏమైంది జానకి అనడంతో రామా ఏదో అబద్ధం చెప్పి అక్కడ నుంచి తప్పించుకుంటారు.ఇక జెస్సి అఖిల్ విషయంలో సంతోష పడుతూ ఉండగా మల్లిక వెళ్లి తిరిగి వాళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది.

మరోవైపు రామ జానకి ఇదే విషయం గురించి కంగారుపడుతూ ఉండగా రామా మాత్రం ఈ విషయం ఎవరికీ తెలియకూడదు ఎవరికైనా తెలిస్తే నా మీద ఒట్టే అంటూ ఒట్టు వేయించుకుంటాడు.రామ మాత్రం ఎవరికి తెలియకుండా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి అఖిల్ కోసం 20 లక్షలు డబ్బు కట్టడంతో జానకి ఎంతో ఎమోషనల్ అవుతుంది.మరి జానకి ఇంటి కాగితాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది నిజంగానే రామ చరణ్ చేతిలో మోసపోతాడా అనే విషయం తెలియాలంటే వేచి చూడాలి.