మొదటి ప్రేమ లేఖ చూసి కన్నీళ్ళు పెట్టుకున్న హైపర్ ఆది…?

బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందిన హైపర్ ఆది జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా పాపులర్ అయ్యాడు. మొదట జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఆది తన ప్రతిభతో టీమ్ లీడర్ గా ఎదిగాడు. జబర్థస్త్ లో ఆది వేసే పంచులు జబర్థస్త్ రేటింగ్స్ పెంచటమే కాకుండా ఆది పాపులారిటీనీ కూడా పెంచింది. దీంతో ఆది కి సినిమాలలో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆది జబర్థస్త్ కి దూరమైనా కూడా సినిమాలలో నటిస్తూనే ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో సందడి చేస్తున్నాడు.

ఇక ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఆది రాంప్రసాద్ బుల్లెట్ భాస్కర్ రష్మీ చేసే సందడి మామూలుగా ఉండదు. ఈ క్రమంలో ఈ వారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో కూడా ఆది రచ్చ చేసినట్లు కనిపిస్తోంది. గత వారం పొట్టి నరేశ్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి స్కిట్ చేశారు. ఇక ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో పంచ్ ప్రసాద జీవితం గురించి స్కిట్ చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ ఎపిసోడ్ లో రెండు కిడ్నీలు పాడైపోయి అనారోగ్యంతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ ని కాపాడుకోవటం కోసం అతని భార్య ఎంత తపించింది ఈ స్కిట్ లో చూపించి అందరినీ ఏడిపించారు

ఇక ఈ ఎపిసోడ్ అందరూ వారి గర్ల్ ఫ్రెండ్ నీ ఎత్తుకొని మ్యూజికల్ చైర్స్ ఆడాలి. ఇలాంటి గేమ్ ప్రతి ఎపిసోడ్ లో ఉంటే బాగుంటుందని ఆది అంటాడు. ఇక హైపర్ ఆది తన గర్ల్ ఫ్రెండ్ ని ఎత్తుకోలేక కింద పడిపోయిన కూడా ఈ సమరంలో ప్రాణాలు పోయినా సరే ఆపేది లేదు అని ఆమెని ఎత్తుకున్నాడు. ఆ తర్వాత రష్మీ అందరికీ లవ్ గిఫ్ట్స్ వచ్చాయని చెప్పి ఆది కి కూడా ఒక గిఫ్ట్ ఇస్తుంది. అయితే అప్పటిదాకా అమ్మాయిలను ఎత్తుకొని చిందులేస్తూ రెచ్చిపోయిన ఆది.. ఆ గిఫ్ట్ చూడగానే కంటతడి పెట్టుకుంటాడు. ఎందుకంటే రష్మి ఇచ్చిన ఆ గిఫ్ట్ లో ఆది టెన్త్ క్లాస్ లో రాసిన ప్రేమ లేఖ ఉంది. తాను రాసిన తొలి ప్రేమ లేఖని చూసుకుని హైపర్ ఆది ఎమోషనల్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకున్నాడు.