కెప్టెన్సీ టాస్క్ లో నెగ్గడం కోసం భారీ స్కెచ్ వేసిన గీతు..చివరికి వెక్కి వెక్కి ఏడుస్తూ క్షమాపణ?

ఇటీవల ప్రారంభం అయిన బిగ్ బాస్ 6వ సీజన్ మొదటి వారం నుండి చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే 7 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ నుండి మొత్తం 7 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇక తాజాగా ఈ సీజన్ 6 8 వ వారంలో కొనసాగుతోంది. 8వ వారంలో ఇప్పటికీ ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఈ నామినేషన్ లో ఇంట్లో ఉన్న మొత్తం 14 మంది కంటెస్టెంట్లు సెలెక్ట్ అయ్యారు. ఇక ఈ ఎనిమిదవ వారంలో తాజాగా జరిగిన ఎపిసోడ్లో కెప్టెన్సీ పదవి కోసం బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు.

ఈ క్రమంలో కెప్టెన్సీ పదవి కోసం బిగ్ బాస్ ఇచ్చిన చేపల చెరువు టాస్క్ లో భాగంగా ఇద్దరు కంటెస్టెంట్లను ఒక్కో జట్టుగా నియమించి ఎవరి వద్ద ఎక్కువ చేపలు ఉంటే వారు టాస్క్ అయినట్లు వెల్లడించారు. అలాగే ఈ టాస్క్ లో తక్కువ చేపలో ఉన్న వారు ఈ టాస్క్ నుండి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇక ఎప్పుడు తన మాటలతో అందరినీ రెచ్చగొట్టి స్ట్రాటజీతో టాస్కులలో నెగ్గుకు వస్తున్న గీతు ఈ చేపల చెరువు టాస్క్ లో నెగ్గడం కోసం ఆదిరెడ్డితో కలిసి భారీగా స్కెచ్ వేసింది. ఈ టాస్క్ లో రేవంత్ ఇనయా ఒక జట్టుగా ఉన్నారు.

ఈ క్రమంలో రేవంత్ ని టార్గెట్ చేసి మాటలతో అతనిని రెచ్చగొట్టి ఆపితే ఇనయ ఎక్కువగా చేపలు ఏర లేదని ఆదిరెడ్డికి ప్లాన్ చెప్పింది . కానీ వీరి ప్లాన్ మాత్రం వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక టాస్క్ లో చేపలు పడినప్పుడు కంటెస్టెంట్లు ఒకరిని మించి మరొకరు పోటీపడి మరీ చేపలను ఏరుకొన్నారు. ఈ క్రమంలో మెరీనా దగ్గరికి వెళ్ళినా గీతుకి నా జోలికి రావద్దు అంటూ మెరీనా వార్నింగ్ ఇచ్చింది. ఈ ఛాలెంజ్ లో ఫైమా, రాజ్ జంట విజేతగా నిలిచి పది చేపలను దక్కించుకున్నారు. ఇక గీతు, ఆదిరెడ్డి దగ్గర తక్కువ చేపలు ఉండటంతో టాస్క్ నుండి తప్పుకుంది. ఈ క్రమంలో గీతు బాధతో వెక్కి వెక్కి ఏడుస్తూ… రేవంత్ ని కాలితో తన్నినందుకు క్షమాపణ చెప్పింది.