ఆటలో లేకపోయినా కూడా మైండ్ గేమ్ మొదలు పెట్టిన గీతు..ఆది రెడ్డితో వైరం పెరగనుందా?

ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో ఫెయిల్ అయిందని ప్రేక్షకుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఆరవ సీజన్లో కంటెస్టెంట్ల ఎంపిక వల్ల ఈ ఆరవ సీజన్ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపటం లేదు. దానికి తోడు కంటెస్టెంట్ల పెర్ఫార్మన్స్ కూడా ప్రేక్షకులను నిరాశ పరుస్తోంది. గత ఐదు సీజన్లతో పోల్చితే ఈ ఆరవ సీజన్ కి రేటింగ్స్ దారుణంగా ఉన్నాయి. ఈ విషయంపై నాగార్జున కంటెస్టెంట్లను ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా వారి ఆటతీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గీతు రాయల్ మొదటి వారం నుండే మైండ్ గేమ్ ఆడటం ప్రారంభించింది. ఫిజికల్ గా గేమ్ ఆడలేని గీతు ఎదుటివారి వీక్నెస్ మీద దెబ్బకొడుతూ.. చాలా తెలివితో ఆట ఆడుతున్నానని తనని తాను మెచ్చుకుంటుంది. గత వారంలో ఇలా చేసినందుకే నాగార్జున చేత చివాట్లు తినింది. అయినా కూడా గీత ప్రవర్తనలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ప్రస్తుతం 9 వ వారంలో కెప్టెన్సీ పదవి కోసం కంటెస్టెంట్లు పోటీ పడుతున్నారు. మొన్న జరిగిన ఎపిసోడ్ లో సిగరెట్లు దాచిపెట్టి బాలాదిత్య వీక్నెస్ తో ఆడుకోవాలని ప్రయత్నం చేసింది.

ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గీతు ఔట్ అయినా కూడా అర్థరాత్రి ఆది రెడ్డి టీషర్ట్ దాచేసి గేమ్ ఆడాలని ప్లాన్ చేసింది. దీంతో బాత్రూం వద్ద దాచుకున్న ఆదిరెడ్డి టీ షర్ట్ దొంగలించి దాచి పెట్టడమే కాకుండా ఆదిరెడ్డి అడిగినప్పుడు నేను తీయలేదు అంటూ అబద్ధం చెప్పింది. దీంతో ఇంతకాలం గీతు కి సపోర్ట్ చేసిన ఆదిరెడ్డి.. తన టీ షర్ట్ గీతు దాచి పెట్టిందని బయటపడితే మాత్రం ఇకపై గీతూ వర్సెస్ ఆదిరెడ్డి గేమ్ స్టార్ట్ అవుతుందని చెప్పాడు.