నేను అన్నయ్య అంటే అందరూ ఫీల్ అవుతారు… అనసూయ షాకింగ్ కామెంట్స్..?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ గురించి తెలియని వారంటూ ఉండరు. జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో బుల్లితెర మీద ప్రచారం అవుతున్న అనేక టీవీ షోలో యాంకర్ గా వ్యవహరించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలలో నటించే అవకాశాలు అందుకొని వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా అనసూయ నటించిన క్షణం రంగస్థలం పుష్ప వంటి సినిమాల ద్వారా అనసూయకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇటీవల అనసూయ జబర్దస్త్ కి దూరమైనప్పటినుండి టీవీ షోలో పూర్తిగా కనిపించకుండా పోయింది.

ఇక ప్రస్తుతం అనసూయ అరడజనకు పైగా సినిమాలలో నటించడమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల “మాయ పేటిక” సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ లో అనసూయ సందడి చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని అనసూయ చేతిలో మీదుగా లాంచ్ చేశారు. గతంలో అనసూయ నటించిన “థాంక్యూ బ్రదర్” సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించిన జస్ట్ ఆర్డినరీ ఎంటర్ టైన్మెంట్ నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించటం ప్రత్యేకత. ఈ ఈవెంట్ లో అనసూయ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

అనసూయ మాట్లాడుతూ.. థాంక్యూ బ్రదర్ అని చెబితే ఇక్కడున్న వాళ్ళందరూ ఫీల్ అవుతారు. అందుకే నేను చెప్పను. ఈ జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నాకు కుటుంబం తో సమానం అంటూ చెప్పుకొచ్చింది. మీ అందరిని ఇంత ఆనందంగా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా నేనొక సెల్ఫీష్ అని అందరూ అంటుంటారు. అటువంటిది నేను ఈ సినిమాలో నటించకపోయినా కూడా సినిమా బాగుందని చెబుతున్నాను అంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో నాకు చాన్స్ ఇవ్వనందుకు డైరెక్టర్ ఒక రీజనబుల్ రీజన్ చెప్పాడు కాబట్టి యుద్ధం జరగలేదు అంటూ సరదాగా చెప్పుకొచ్చింది.