జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యరావు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…?

గత తొమ్మిది సంవత్సరాలుగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోకి ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో ప్రారంభమైనప్పటినుండి అనసూయ, రష్మి యాంకర్లుగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా అనసూయ ఇటీవల జబర్దస్త్ కామెడీ షో కి దూరం కావడంతో ఆమె స్థానంలో మరొక కొత్త యాంకర్ వస్తుందని ప్రచారం జరిగింది. ఈ మేరకు ఎంతోమంది యాంకర్ల పేర్లు కూడా వినిపించాయి. అనసూయ లాగా రష్మి మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకోగలదని భావించిన మల్లెమాల సంస్థ ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు జబర్థస్త్ కి రష్మి ని యాంకర్ గా నియమించింది.

కొంతకాలంగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి మూడు షోస్ లో రష్మి యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం జబర్దస్త్ లో అనసూయ స్థానంలో యాంకర్ గా మరొక కొత్త యాంకర్ ని మల్లెమాల ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ లో కొత్త యాంకర్ ఎంట్రీ ఇవ్వనుంది.
సౌమ్య రావు అని ఒక కన్నడ అమ్మాయి ని జబర్దస్త్ యాంకర్ గా మల్లెమాలవారు పరిచయం చేశారు. కన్నడ ఇండస్ట్రీలో సీరియల్స్ లో నటించి ఫేమస్ అయినా సౌమ్యరావు ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీమంతుడు సీరియల్ లో కూడా విలన్ పాత్రలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

అంతేకాకుండా ఈటీవీ వారు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొంటూ ఆది, రాంప్రసాద్ వంటి కమెడియన్లకి రివర్స్ పంచులు వేస్తూ బాగా ఫేమస్ అయ్యింది. దీంతో మల్లెమాలవారు సౌమ్యరావుని జబర్దస్త్ యాంకర్ గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇక ఈ జబర్దస్త్ షోలో యాంకర్ గా అవకాశం దక్కించుకున్న సౌమ్యరావుకి మల్లెమాలవారు ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. బుల్లితెర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. సౌమ్య రావు జబర్దస్త్ యాంకర్ గా ఒక షెడ్యూల్ కి దాదాపు రూ. 60 వేలు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇక రాబోయే రోజుల్లో సౌమ్యరావు తన యాంకరింగ్ తో అనసూయ, రష్మి లను మరిపించేల యాంకరింగ్ చేస్తే ఆమె రెమ్యునరేషన్ పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.