జబర్దస్త్ కొత్త యాంకర్స్ కి మల్లెమాలవారు ఇస్తున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి ప్రేక్షకులలో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమీడియన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తూ వారికి అవకాశాలు కల్పించడంలో జబర్దస్త్ ఎప్పుడు ముందు ఉంటుంది. ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతోమంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నారు. ఇలా ఎంతోమంది ఆర్టిస్టులకు జీవితాన్ని ఇచ్చిన ఈ జబర్దస్త్ షోలో అవకాశం పొందటానికి అందరూ ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా జబర్దస్త్ ద్వారా యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ సినిమా అవకాశాలు రావటంతో ఇటీవల జబర్దస్త్ కి దూరం అయింది.

అనసూయ వెళ్ళిన తర్వాత కొంతకాలం రష్మి ఆమె స్థానంలో యాంకర్ గా వ్యవహరించింది. అయితే ఇటీవల జబర్దస్త్ లో కొత్త యాంకర్ గా వచ్చిన సౌమ్య రావు తనదైన శైలిలో యాంకర్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందరి మీద సెటైర్లు వేసే ఆది రాంప్రసాద్ వంటి వారి మీద కూడా కావ్య సెటైర్లు వేస్తూ ఆకట్టుకుంటుంది. ఇలా జబర్దస్త్ యాంకర్ గా పరిచయమైన మొదటి ఎపిసోడ్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న కావ్య రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. బుల్లితెర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. జబర్ధస్త్ యాంకర్ గా ఒక్కో ఎపిసోడ్‏కి రూ.85 వేలు వరకు రెమ్యూనరేషన్ అండుకుంటున్నట్లు తెలుస్తోంది.

జబర్థస్త్ యాంకర్ గా అనసూయ ఒక్కో షెడ్యూల్ కి దాదాపు 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకునేది. అనసూయ యాంకర్ గా బాగా పాపుల రావటంతో ఆమెకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. అనసూయతో పోలిస్తే కావ్య రావు రెమ్యూనరేషన్ చాలా తక్కువ. ఒకవేళ సౌమ్య యాంకరింగ్ కి ఆమె గ్లామర్ తోడై షోకి మంచి రేటింగ్ వస్తే భవిష్యత్తులో ఆమె పారితోషికం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జబర్థస్త్ యాంకర్ గా సౌమ్య రావు పాపులర్ అయితే మరిన్ని షో లలో యాంకర్ గా వ్యవహరించే అవకాశం అందుకోవటమే కాకుండా సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు.