డబ్బులు తీసుకొని ఊరు వదిలి వెళ్లిన చరణ్…. మల్లిక తో కలిసి రామాను నిందించిన అఖిల్!

ఉమ్మడి కుటుంబం విలువలు ప్రాధాన్యతను తెలియజేస్తూ బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే… రామ ఇంటి కాగితాలను తాకట్టుపెట్టి 20 లక్షలు అప్పు తీసుకున్నారని చెప్పారు.అయితే అది అఖిల్ జాబ్ కోసమే తీసుకున్నానని చరణ్ బెంగళూరులో మంచిగా స్థిరపడి ఇక్కడ కంపెనీ పెట్టారు. అఖిల్ చదువుకు తగ్గ ఉద్యోగం రావాలంటే 20 లక్షల పెట్టుబడి పెట్టాలని అది తన కంపెనీ రూల్ అని చెప్పడంతో ఎవరికి తెలియకుండా ఇంటి కాగితాలు తాకట్టుపెట్టి ఆ డబ్బు చరణ్ కి కట్టానని తెలిపారు.

ఇలా రామ జరిగినది మొత్తం చెప్పడంతో అఖిల్ మాత్రం ఇన్ని రోజులు నీకు తెలివి లేదు అనుకున్నాను కానీ ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అన్నయ్య. ఇదంతా కూడా వదిన ట్రైనింగ్ ఏ కదా అంటూ మాట్లాడుతారు. నా టాలెంట్ మీద నాకు జాబ్ వచ్చిందని ఫోన్ చేశారు. కానీ నువ్వు మాత్రం ఆ 20 లక్షలు మచ్చ నాపై వేసి నీకే సంబంధం లేకుండా ఉండడం కోసం ఇలా మాట్లాడుతున్నావు కదా అంటూ అఖిల్ మాట్లాడతారు. దీంతో జానకి రామ గారు చెప్పేది నిజం అఖిల్ ఆ 20 లక్షలు నీ ఉద్యోగం కోసమే కట్టారని జానకి చెప్పినప్పటికీ ఎవరు నమ్మరు.

దీంతో రామ ఇప్పుడే చరణ్ ని తీసుకొచ్చి నిజం చెప్పిస్తానని తన ఆఫీసుకు వెళ్తారు రామాతోపాటు గోవిందరాజులు విష్ణు అఖిల్ కూడా వెళ్తారు. మరోవైపు మల్లికా జెస్సి గదిలోకి వెళ్లి జానకి గురించి చెడుగా చెబుతుంది అయితే జెస్సీ మాత్రం రామా జానకీ సపోర్టివ్ గా మాట్లాడుతుంది. వాళ్లు అలా మోసం చేయరంటూ తాను ఉమ్మడిగా కలిసి ఉండడానికే ఇష్టపడతానని జెస్సీ తేల్చి చెబుతుంది. మరోవైపు రామా వాళ్ళు ఆఫీస్ కు వెళ్లగా అక్కడ ఏమి ఉండదు అక్కడ ఉన్నటువంటి వాచ్ మెన్ నుఅడగడంతో కేవలం వారం రోజులు ఆఫీస్ పెట్టుకోవడం కోసమే అద్దెకు తీసుకున్నారని చెప్పగా గోవిందరాజులు డబ్బు తీసుకొని ఊరు వదిలి వెళ్లిపోయారని బాధపడతారు దీంతో దిగాలుగా ఇంటికి తిరిగి వస్తారు.

రామ వాళ్ళు ఇంటికి తిరిగి రాగానే ఏమైంది ఎందుకు అలా ఉన్నారని జ్ఞానాంబ అడగడంతో ఆ చరణ్ 20 లక్షలు తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోయారు మనల్ని మోసం చేశారు అని చెప్పగా ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. గోవిందరాజులు ఇదే మాట చెప్పేసరికి మల్లిక లేనిపోనివి మాట్లాడుతూ మేము ఈ కుటుంబంలో ఉండడం దండగ ఇప్పుడే బయటకు వెళ్ళిపోతాం ఎవరి వాటాలు వారికి పంచండి అంటూ మాట్లాడుతుంది. ఇక మల్లికకు అఖిల్ కూడా వత్తాసు పలికి రామా, జానకిను దోషిగా చూస్తాడు.