బిగ్ బాస్ కంటెస్టెంట్ ల ఓటింగ్ తారుమారు… డేంజర్ జోన్ లో టాప్ కంటెస్టెంట్లు?

దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు భాషలో కూడా ప్రసారమవుతా ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల బిగ్ బాస్ ఆరవ సీజన్ కూడా ప్రారంభం అయ్యి ఇప్పటికి 7 వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ వారంలో కొనసాగుతోంది. ఇక ఈ ఎనిమిదవ వారంలో తాజాగా జరిగిన ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్ల ఓటింగ్ చాలా తారుమారు అయ్యాయని సమాచారం. రోజు రోజుకి కంటెస్టెంట్లు ఆట తీరును బట్టి ఓటింగ్ మారుతూ ఉంటుంది.

ఇక ఈ ఎనిమిదవ వారంలో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఆ తర్వాత కెప్టెన్సీ పదవి కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కంటెస్టెంట్ల పెర్ఫార్మన్స్ ని బట్టి ప్రేక్షకుల ఓటింగ్ జరుగుతుంది. ఇలా ఈ ఎనిమిదవ వారంలో కంటెస్టెంట్ల పెర్ఫార్మన్స్ ఆధారంగా టాప్ రేంజ్ లో ఉన్న కంటెస్టెంట్లు కూడా చివరి స్థానంలో నిలవడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో వచ్చిన ఓటింగ్ ప్రకారం కంటెస్టెంట్ల స్థానాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ప్రతి వారం లాగే మొదటి రెండు స్థానాలలో ఎటువంటి మార్పు లేకుండా రేవంత్ మొదటి స్థానంలో నిలవగా శ్రీహన్ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మూడవ స్థానంలో గీతు రాయల్, నాల్గవ స్థానంలో మెరీనా నిలిచారు. ఇక ఐదవ స్థానంలో ఆదిరెడ్డి, ఆరవ స్థానంలో ఇనాయా సుల్తానా, ఏడు,ఎనిమిది స్థానాలలో వరుసగా బలాదిత్య, రోహిత్, కీర్తి భట్, వాసంతీ నిలిచారు. అయితే ఈ వారంలో ఎవరు ఊహించని విధంగా రాజశేఖర్ 12వ స్థానంలో ఉండగా.. శ్రీ సత్య, అర్జే సూర్య 13, 14 స్థానాల్లో నిలిచారు. టాప్ కంటెస్టెంట్లుగా ఉన్న రాజశేఖర్ , ఆర్ జె సూర్య ఎనిమిదవ వారంలో మాత్రం చివరి స్థానాల్లో నిలిచి డేంజర్ జోన్ లో ఉన్నారు.