రష్మీ రాత్రంతా గేటు బయట కూర్చుని ఉండేదా.. రష్మీ కష్టాలు మామూలుగా లేవు?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ రష్మీ గురించి అందరికీ సుపరిచితమే.ఎప్పుడు మొహంలో చిరునవ్వులు చిందిస్తూ కనిపించే రష్మీ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.అయితే ఈమె మొహంలో కనిపించే నవ్వు వెనక కష్టాలు సుడిగుండం ఉంది అనే విషయం ఎవరికీ తెలియదు. రష్మీ ఎంతో కష్టపడితేనే కానీ ఈ స్థాయికి రాలేదని చెప్పాలి. రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా రష్మీ తన చిన్నప్పుడు అనుభవించిన కష్టాల గురించి నటి భాను శ్రీ ఒక స్కిట్ రూపంలో తెలియజేశారు. ఈ క్రమంలోనే చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు కొన్ని మనస్పర్ధలు వల్ల విడిపోవడంతో రష్మి చిన్నప్పటి నుంచి తన తల్లివద్దే పెరుగుతూ వచ్చింది.ఇకపోతే తను పెరిగి పెద్దయిన తర్వాత తనకు సినిమాలలో అవకాశాలు వస్తున్నాయని తన తల్లి వద్ద చెప్పగానే తన తల్లి ఈ విషయం విని నీకు మంచి ఏదో చెడేదో తెలుసు నీకు ప్రత్యేకంగా జాగ్రత్తలు చెప్పాల్సిన పని లేదు అంటూ తనని ప్రోత్సహించినట్లు ఈ స్కిట్ ద్వారా భాను శ్రీ తెలియజేశారు.

ఈ విధంగా పలు సినిమాలలో నటిస్తూ రష్మీ ఎంతో బిజీగా మారిపోయారు అయితే షూటింగ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయానికి ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ గేటు తాళాలు వేసేవారని ఎంత పిలిచినా గేటు తీసే వాళ్ళు కాదు..చుట్టూ చీకటి ఒంటరిగా అలా ఎన్నో రాత్రులు గేటు దగ్గరే కాపలా కూర్చొని ఉండిపోయాను అంటూ రష్మి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను భాను శ్రీ స్కిట్ ద్వారా చూపించారు. అయితే ఈ స్కిట్ చూస్తున్నంత సేపు రష్మీ కన్నీటి పర్యంతరమయ్యారు. అనంతరం హైపర్ ఆది మాట్లాడుతూ తెలుగు సరిగా మాట్లాడటం రాని రష్మీ ఇండస్ట్రీ లోకి వచ్చి తన గురించి తెలుగు వాళ్ళందరూ మాట్లాడుకునే స్థాయికి ఎదిగారు అంటూ రష్మీ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు.