ఇంటి పత్రాలు తాకట్టు పెట్టాడని రామాను నిలదీసిన అఖిల్…. నిజం చెప్పేసిన రామ!

కుటుంబ గొప్పతనం ఉమ్మడి కుటుంబ విలువలను తెలియజేస్తూ బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే… వడ్డీ వ్యాపారి జ్ఞానంభ ఇంటికి వచ్చి రామ ఇంటి కాగితాలు తన వద్ద తాకట్టు పెట్టి 20 లక్షలు అప్పు తీసుకున్నారు అని చెబుతారు. ఇలా వడ్డీ వ్యాపారి ఇంట్లో ఉండేసరికి జానకి కంగారు పడుతూ ఉంటుంది. ఇలా రామ తప్పు చేశాడని తెలియడంతో ఇంట్లో ఎవరూ కూడా నమ్మరు. ఇక వడ్డీ వ్యాపారి ఇంటి కాగితాలు తనకు చూపించడంతో అందరూ నమ్ముతారు.

ఇక అంతలోనే రామ కూడా అక్కడికి రావడంతో ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి 20 లక్షలు అప్పు తీసుకొనే అంత కష్టం ఏమొచ్చింది రామా..కళ్ళముందు సాక్ష్యం కనబడుతున్నప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అని జ్ఞానంభ అడుగుతుంది. ఇదే అదునుగా భావించిన మల్లికా అఖిల్ ఇద్దరు కూడా రామా పై నిందలు వేస్తారు. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయడంతో జానకికి కూడా ఈ విషయం తెలిసే ఉంటుందని మల్లికా అనడంతో జ్ఞానంభ నిజమా జానకి అని అడగడంతో జానకి అవునని సమాధానం చెబుతుంది దీంతో అందరూ షాక్ అవుతారు.

ఇదే అదునుగా భావించిన అఖిల్ వదిన సలహాతోనే ఏ పొలము ఫ్లాట్ కొని ఉంటారు అంటూ నోటికొచ్చినట్లు రామాను నిలదీస్తూ ఉన్నప్పటికీ తను మాత్రం ఎట్టి పరిస్థితులలోను ఈ విషయం బయటకు చెప్పకూడదని అనుకుంటాడు. జానకి కూడా ఇప్పటికైనా నిజం చెప్పండి అని మనసులో బాధపడుతుంది. ఇలా అందరూ తనని దోషిగా చూసేసరికి రామా నిజం చెబుతాడు.నేను ఆ డబ్బుతో ఎలాంటి పొలం ఫ్లాట్ కొనలేదు నీ ఉద్యోగం కోసం 20 లక్షలు ఖర్చు చేశానని నిజం బయటపెడతాడు. నీకు ఉద్యోగం రావాలంటే 20 లక్షలు కట్టాలని చెప్పడంతో తాను ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి 20 లక్షలు కట్టానని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఎవరికోసమైతే నేను 20 లక్షలు కట్టానో చివరికి వాళ్లే నన్ను దోషిగా చూస్తున్నారు అంటూ రామా ఎమోషనల్ అవుతారు.