కొత్త యాంకర్ ని లైన్ లో పెట్టే పనిలో ఉన్న ఆది… పాపం పరువు తీసిన యాంకర్…?

టాలెంట్ తో టీం లీడర్ స్థాయికి చేరుకున్నాడు. ఇక టీం లీడర్ గా మారిన తర్వాత ఆది తన కామెడీ పంచులు, సెటైర్లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇలా జబర్దస్త్ ఆర్టిస్టులనే కాకుండా జడ్జిలు, యాంకర్లను కూడా వదలకుండా వారిపై కూడా సెటైర్లు వేస్తూ రెచ్చిపోతున్నాడు. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన ఆది ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలు మాత్రమే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నాడు.

ఇక జబర్థస్త్ షో లో యాంకర్ అనసూయ తో ఆది చేసిన సందడి అంతా ఇంతా కాదు. అనసూయ కి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆది ఆమె ను ఆకట్టోకోవటానికి చాలా ప్రయత్నాలు చేసేవాడు. అనసూయ కూడా అప్పుడప్పుడు ఆది తో కలసి స్టెప్పులు వేస్తూ సందడి చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల అనసూయ జబర్థస్త్ కి దూరమయింది. అనసూయ వెళ్ళిపోయిన తర్వాత ఆమె స్థానంలో రష్మీ కొంతకాలం జబర్దస్త్ యాంకర్ గా వ్యవహరించింది. ఇక తాజాగా అనసూయ స్థానంలో జబర్దస్త్ లో కొత్త యాంకర్ అడుగుపెట్టింది.

జబర్దస్త్ లో కొత్త యాంకర్ గా అడుగుపెట్టిన సౌమ్య రావు ని కూడా ఆది లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడు. కానీ తీరు చుస్తుంటే అంత ఈజీగా ఆదికి పడేలా కనిపించటం లేదు. తాజాగా వచ్చేవారం ప్రసారం కానున్న జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో సౌమ్యారావు బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ అంటూ ఎంట్రీ సాంగ్ కి డాన్స్ చేసింది. దీంతో అది ఇంటర్ అయ్యి ఇలా ఒక్కదానివే డాన్స్ చేస్తే వట్టి బొమ్మ అవుతావు. అలాగే ఇద్దరం కలిసి డాన్స్ చేస్తే అప్పుడు బుట్ట బొమ్మ అవుతుంది అంటూ అమెను పడేయటానికి ట్రై చేశాడు. అయితే సౌమ్య రావు మాత్రం..మీరు ఎంత పులిహోర కలిపినా నేను మీకు పడను అని చెబుతుంది. దీంతో ఆది రెచ్చిపోయి అయితే ఛాలెంజ్.. నేను చిరంజీవి ఫ్యాన్ ని తెలుసా అని అంటాడు.. దీనికి సౌమ్య చిరంజీవివి కాదుగా అంటూ ఆది గాలి తీస్తుంది. ఇలా కొత్త యాంకర్ ని పడేయటానికి ప్రయత్నం చేసిన ఆది చివరికి పరువు పోగొట్టుకున్నాడు.