అందరి ముందు అఖిల్ పరువు తీసిన ఆది.. తెల్లమొహం వేసిన అఖిల్?

బుల్లితెర మీద ప్రసారమయిన బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతోమంది బాగా ఫేమస్ అయ్యారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో అఖిల్ సార్థక్ కూడా ఒకరు. బిగ్ బాస్ షోకి రాకముందు అఖిల్ ఎన్నో సీరియల్స్ లో నటించినప్పటికీ సరైన గుర్తింపు లభించలేదు. కానీ బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత అఖిల్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న అఖిల్ ఆ సీజన్ లో రన్నరప్ గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోస్ సందడి చేశాడు. ఈ క్రమంలో సుధీర్ ఢీ షో నుండి బయటికి వచ్చిన తర్వాత అఖిల్ ఆ షోలో మెంటర్ గా కొంతకాలం కొనసాగాడు.

అయితే అఖిల్ ఎప్పుడూ ఎవరితో ఎక్కువ కలివిడిగా ఉండేవాడు కాదు. ఢీ షో లో కూడా ఆది తనపై పంచ్ లు వేసినా కూడ ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వడు. ఇలా ఢీ షోలో కొంతకాలం మెంటర్ గా కొనసాగిన తర్వాత బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనే అవకాశం రావడంతో ఢీ షోకి దూరమయ్యాడు. ఓటిటి సీజన్ ముగిసిన తర్వాత ఇప్పుడు మళ్లీ ఢీ షో లో కనిపించాడు. తాజాగా విడుదలయిన ఢీ ప్రమోలో అఖిల్ ఊరి పెద్దగా దర్శనం ఇచ్చాడు. ఈ ఎపిసోడ్లో ఆది ఎప్పటిలాగే అఖిల్ మీద సెటైర్లు వేస్తూ రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

ఈవారం ప్రసారం కాబోయే ఢీ ఎపిసోడ్ లో విలేజ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ తో సందడి చేయనున్నారు. దీంతో ఢీ షోలో పల్లెటూరి వాతావరణం కనిపించింది. ఈ ఎపిసోడ్లో అఖిల్ ఊరి పెద్దగా సందడి చేశాడు. తెల్ల చొక్కా పంచ కట్టుకొని కండువా వేసుకొని పూరి పెద్దగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఊర్లో జనాలు తన గురించి ఏమనుకుంటున్నారు అని ఆదిని అడగ్గా.. ఎందుకు వెళ్ళాడు ఎందుకు వచ్చాడు అని అనుకుంటున్నారు అంటూ అది సెటైర్ వేశాడు. దీంతో అఖిల్ ఏం సమాధానం చెప్పాలో తెలియక తెల్ల మొహం వేశాడు. ఇక ఎప్పటిలాగే జానీ మాస్టర్ మీద కూడా ఆది కౌంటర్లతో రెచ్చిపోయాడు.