హాస్పిటల్ లో చేరిన ప్రముఖ బుల్లితెర యాంకర్.. ఆందోళనలో అభిమానులు..!

సంథింగ్ స్పెషల్ షో ద్వారా మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా సందడి చేసిన లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలా మ్యూజిక్ ఛానల్ లో రవితో కలిసి యాంకరింగ్ చేస్తూ గుర్తింపు పొందిన లాస్య ఆ తర్వాత బుల్లితెర మీద ప్రసారమైన అనేక టీవీ షోస్ లో రవితో కలిసి యాంకరింగ్ చేస్తూ బాగా పాపులర్ అయింది. ఈ క్రమంలో ఈటీవీలో ప్రసారమైన ఢీ షోలో కూడా మెంటర్ గా సందడి చేసింది. ఏనుగు,చీమ కథ చెబుతు అందరినీ నవ్వించే లాస్య యాంకర్ రవితో తరచు సరదాగా గొడవపడుతు మంచి గుర్తింపు పొందింది.

ఇక లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహాం చేసుకుంది. వీరికి ఒక బాబు. పెళ్ళి తర్వాత లాస్య టీవి షోస్ కి దూరమయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ షో లో పాల్గొని సందడి చేసింది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత లాస్య మళ్లీ టీవి షోస్ లో కనిపిస్తూ సందడి చేసింది. అంతే కాకుండా సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి యూట్యూబ్ లో హోం టూర్ వీడియోలు, షాపింగ్ వీడియోలు, తనకు సంబంధిచిన వీడియోలను యూట్యూబ్లో షేర్ చేసుకో ఉంటుంది. ఈ వీడియోల ద్వారా లాస్య లక్షల సంఖ్యలో ఫాలోవర్లను సొంతం చేసుకుంది.

అయితే తాజాగా లాస్య అనారోగ్యం వల్ల హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని లాస్య భర్త మంజునాథ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. హాస్పిటల్లో బెడ్ మీద దీనంగా పడుకుని ఉన్న లాస్య ఫోటోని షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు. గత కొంతకాలంగా లాస్య వైరల్ ఫీవర్ తో బాధపడుతుండటం వల్ల మంజునాథ్ ఆమెను హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అనారోగ్యంతో లాస్య ఇలా హాస్పిటల్ లో చేరటంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.లాస్య త్వరగా కోలుకుని ఎప్పటిలాగే తన మాటలతో సందడి చేయాలని ఆమె అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.