రానా తో మైత్రీ మూవి మేకర్స్, డైరక్టర్ ఆయనే

బాహుబలితో స్టార్ స్టేటస్ పొందిన దగ్గుపాటి రానా వరస పెట్టి ప్రాజెక్టులను ఓకే చేస్తున్నారు. తమిళ,తెలుగు, మళయాళ భాషల్లో ఆయన సినిమాలు వచ్చే సంవత్సరం వరస పెట్టి రిలీజ్ కానున్నాయి. ఈ సంవత్సరం ఒక్క రిలీజ్ కూడా కాలేదనే లోటును వరస సినిమాలు తీర్చనున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన ప్రముఖ దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ తో సినిమా ఓకే చేసినట్లు సమాచారం.

రీసెంట్ గా రానాని కలిసి ఏలేటి..ఓ ఎక్సైటింగ్ స్క్రిప్టుని ఒకటి నేరేట్ చేసినట్లు సమాచారం. లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీస్ వారు ఈ సినిమాని నిర్మిస్తారు. యేలేటి ప్రస్తుతం ఈ స్క్రిప్టు పై వర్క్ చేస్తున్నారు. ఐతే, అనుకోకుండా ఒక రోజు తరహాలోనే ఈ చిత్రం సైతం ఓ థ్రిల్లర్ కధాంశంతో రూపొందనుంది. ఈ సినిమా స్టోరీ లైన్ విన్న వెంటనే ఎక్సైట్ అయిన రానా ..గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం.

మొదటి నుంచీ విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు చంద్రశేఖర్ ఏలేటి. మనమంతా సినిమా అనంతరం కొంత విరామం తరువాత ఆయన కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. కొత్త తరహా కథలతో సినిమాల్ని తెరకెక్కించే ఆయన తాజాగా తనదైన శైలి కథ, కథనాలతో ఈ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మొదట సాయి ధరమ్ తేజతో ఈ చిత్రం అనుకున్నారు కానీ రానా అయితే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చి ఓకే చేయించుకున్నారు.