రజనీ ‘దర్బార్‌’ అతి: అందుకే స్టూడెంట్స్ రాళ్లతో దాడి

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం‘దర్బార్‌’. ఈ చిత్రం టీమ్ పై దాడి జరిగింది. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ఓ కాలేజీలో సీన్స్ షూట్ చేస్తున్నారు.

అయితే లీక్ లు బెడద పెరిగిపోయిన నేపథ్యంలో ఎలాంటి సీన్లు బయటికి రాకుండా చిత్రం టీమ్ జాగ్రత్తలు తీసుకుంది. కాలేజీలో షూటింగ్ జరుగుతుండడంతో విద్యార్థులు షూటింగ్‌ చూసేందుకు ఎగబడ్డారు. దాంతో చిత్రం టీమ్ వారిని దూరంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో చిత్రం టీమ్ కి, స్టూడెంట్స్ కు మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దాంతో చిత్రం టీమ్ పై వారు రాళ్లు రువ్వినట్లు సమాచారం. తమ కాలేజీలో షూటింగ్ చేస్తూ తమను చూడటానికి అనుమతించరా అని వారు కోపం తెచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో దర్శకుడు మురుగదాస్‌ ఈ విషయం గురించి కాలేజి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. వెంటనే షూటింగ్‌ లొకేషన్‌లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే ఈ విషయం గురించి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

‘దర్బార్‌’ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో తలైవా ఖాకీ గెటప్‌లో కనిపించనున్నారు. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.