ప్ర‌కాష్ రాజ్ ని చంపేస్తామంటూ లేఖ‌

విలక్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ని చంపేస్తామంటూ ఓ లేఖ సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఈనెల 29న బుధ‌వారం ప్ర‌కాశ్ రాజ్ చ‌వాడానికి సిద్దంగా ఉండు అంటూ కొంద‌రు దుండ‌గ‌లు లేఖ ద్వారా బెదిరించే ప్ర‌య‌త్నం చేసారు. ధ‌ర్మ ద్రోహులు..దేశ ద్రోహుల‌ను శిక్షించ‌డానికి జ‌న‌వ‌రి 29న ముహూర్తం తేదీగా నిర్ణ‌యించాం. ఇక మీకు కాలం చెల్లింది. చివ‌రి ప్ర‌యాణానికి సిద్దం కండి అంటూ హెచ్చ‌రించారు.

ప్ర‌కాశ్ రాజ్ తో పాటు కర్ణాట‌క మాజీ సిఎం కుమార‌స్వామి, నిజాగుణానంద స్వామి, బ‌జ‌రంగ్ ద‌ళ్ నేత మ‌హేంద్ర కుమార్, నిడుమామిడి వీరభద్ర చెన్నమళ్లస్వామి, జ్ఞానప్రకాశ్ అసూరీ, నటుడు చేతన్ కుమార్, బీటీ లలిత్ నాయక్, మహేశ్‌చంద్ర గురు, భగవాన్, దినేశ్ అమైన్ మట్టు, చంద్రశేఖర్ పాటిల్, దుండి గణేశ్, రౌడి అగ్ని శ్రీధర్, బృందా కారత్, పేర్లు ఈ బెదింరిపు లేఖ‌లో ఉన్నాయి. ఈ లేఖ‌ను ప్ర‌కాశ్ రాజు త‌న ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. లేఖ‌లో పేర్లు ఉన్న అంద‌రికీ ఇళ్లకి ప్ర‌త్యేక భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు న‌మోదు చేసి లేఖ కు సంబంధించిన కూపీ లాగుతున్నారు. ఎవ‌రైనా ఆక‌తాయిలు చేసిన ప‌నా? లేక ఆ లేఖ‌ సీరియ‌స్ గానే ఓ హెచ్చిరికా అన్న కోణంలో కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. రాజ‌కీయా కోణంలోనూ కేసును ఓ బృందం విచార‌ణ చేస్తున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో ప్ర‌కాశ్ రాజ్ ప‌లు మార్లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. కానీ ఎనాడు ఇలాంటి హెచ్చ‌రిక‌ లేఖ‌లు రాలేదు. తొలిసారి చంపేస్తామంటూ బెదిరింపులు రావ‌డంతో ప్ర‌కాష్ అలెర్ట్ అయిన‌ట్లు స‌మాచారం.