ఎహే ఆపండి..అసలు లెక్క వేరే ఉంటుంది

‘పెళ్లి చూపులు’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నటుడు విజయ్‌ దేవరకొండ. అర్జున్ రెడ్డి, ‘గీత గోవిందం’,టాక్సీవాలా చిత్రలతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ‘నోటా’ సినిమాతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టినా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయితే ఆయన ఇప్పుడు మరో తమిళ,తెలుగు చిత్రం కమిటయ్యారు. దాంతో ఇప్పుడంతా ఆయన నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.

నోటా ప్లాఫ్ అయినా మళ్లీ తమిళ డైరక్టర్స్ ని నమ్మటం మానలేదని అంటున్నారు. తెలుగు దర్శకులకు విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్, లాంగ్వేజ్ పై పట్టు ఉంది కాబట్టి అందుకు తగినట్లుగా హిట్స్ ఇస్తున్నారని, అదే పరభాషా దర్శకులకు కరువు అవుతోందని అంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం..విజయ్ దేవరకొండ అంత తెలివితక్కువవాడు కాదు. అతని నిర్ణయాలు ఎప్పటికప్పుడు సక్సెస్ ఫుల్ గా నిలిచి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కాబట్టి ఈ తమిళ సినిమా ఓకే చేయటం వెనక కూడా తనదైన స్టాటజీ ఉంటుందని అంటున్నారు.

ఇక అసలు టాపిక్ లో వెళ్తే.. ప్రస్తుతం శ్రీకార్తీక్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న ద్విభాషా చిత్రంలో విజయ్‌ నటిస్తున్నాడు. ‘పెళ్లిచూపులు’ ఫేం ప్రియదర్శిని, రాహుల్‌ రామకృష్ణలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తిచేసుకొంటోంది. కోలీవుడ్ ఇంట్రస్టింగ్ చిత్రాలను తెరకెక్కిస్తున్న డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ శ్రీ కార్తీక్‌ ను దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్నాడు.

చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలుడనుంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ డియర్‌ కామ్రేడ్‌ సినిమాతో పాటు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు.