ఉపాసన రిక్వెస్ట్.. కేటీఆర్‌​ రెస్పాన్స్!

సెలబ్రెటీగా ఉండటం కన్నా సోషల్ రెస్పాన్సబులిటి ఉన్న వ్యక్తిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతూంటారు రామ్ చరణ్ భార్య ఉపాసన. ఆమె
అపోలో గ్రూప్స్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నా…సమాజానికి పనికొచ్చే ఏదో పని చేస్తూంటారు. అంతేకాకుండా ..సోషల్ మీడిలోనూ తన ట్వీట్స్ ,పోస్ట్ లతో హల్ చల్ చేస్తూంటారు.ముఖ్యంగా తన భర్త రామ్ చరణ్ గురించి సోషల్‌ మీడియాలో అప్‌డేట్స్‌ ఇస్తూ ఉండే ఉపాసనకు మెగాభిమానుల నుంచి భారీగానే ఫాలోయింగ్‌ ఉంది.

రీసెంట్‌గా ఉపాసన ఓ దివ్యాంగుల వసతి గృహానికి వెళ్లారు. అక్కడ వారికి స్వయంగా వడ్డించి భోజనం పెట్టారు. కప్పుకోవటానికి దుప్పట్లను కూడా పంచారు. అదే సమయంలో ఈ హాస్టల్‌కు ఓ నూతన భవనాన్ని మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ ట్వీట్ చేసారు.

మంత్రి కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ..‘తెలంగాణ ప్రభుత్వం ఎంతో బాగా పనిచేస్తోంది. అయితే మాకు మీ తరుపునుంచి ఇంకొంచెం ప్రేమ కావాలి. దయచేసి ఈ అమ్మాయిలకు సహాయాన్ని అందించండి. నాకు చేతనైన సహాయాన్ని నేను చేస్తున్నాను. వీరందరికి నూతన భవనాన్ని మంజూరు చేయండి’అన్నారు.

వెంటనే కేటీఆర్‌ బదులిస్తూ.. పాఠశాలకు నూతన భవనం మంజూరు కావడం సంతోషం.. అయితే వసతి గృహానికి నూతన భవనాన్ని మంజూరు చేయాలంటే డిసెంబర్‌ 11 వరకు మనం ఎదురుచూడాలి అంటూ తెలిపారు. అలా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ఉపాసన. అంటే త్వరలో వారికి కొత్త భవనం ఖచ్చితంగా ఏర్పాటు అవుతుందన్నమాట.