డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో చిక్కిన తెలుగు నిర్మాత కొడుకు

హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు వీకెండ్ లో మస్ట్ అండ్ షుడ్ గా జరుగుతాయి. వాటిల్లో చాలా సార్లు సినిమావాళ్లు, సెలబ్రెటీలు పట్టుబడ్డారు. మిగతా వాళ్లు పట్టుబడినా మీడియా పెద్దగా హైలెట్ చేయదు. కానీ సినిమా వారతై అది అతి పెద్ద న్యూసే. తాజాగా జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ఓ సినీ నిర్మాత కుమారుడు పట్టుబడటం వార్త అయ్యింది.

వివరాల్లోకి వెళితే…జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10లోని డైమండ్‌ హౌస్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ కారును నిలువరించిన పోలీసులు దానిని నడుపుతున్న యువకుడికి శ్వాస విశ్లేషణ పరీక్షలు చేసేందుకు ప్రయత్నించగా అతను వాగ్వాదానికి దిగాడు. తాను ప్రముఖుడి కుమారుడినంటూ హంగామా సృష్టించాడు.

అదే సమయంలో విధుల్లో ఉన్న జూబ్లీహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకుని అతడికి పరీక్షలు చేయగా మద్యం సేవించినట్లు తేలింది. యువకుడు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 25లో నివసించే ఓ సినీ నిర్మాత కుమారుడు సాయి నితీష్‌గా తేలింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అతన్ని వదిలిపెట్టాలంటూ ఓ ఎమ్మల్యే నుంచి సైతం పోలీసులకు ఒత్తిడి వచ్చింది. కాగా ఈ తనిఖీల్లో 12 బైక్ లు , 5 కార్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారికి సోమవారం కౌన్సెలింగ్‌ నిర్వహించి అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.