‘టిక్‌ టాక్‌’ టాప్ సెలబ్రిటీని దారుణంగా చంపేసారు

ఇండియాలో పాపులర్ అయిన టిక్ టాక్ యాప్‌‌లో లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న మోహిత్ మోర్ అనే 24ఏళ్ల యువకుడు హత్యకు గురవ్వడం ఢిల్లీలో సంచలనంగా మారింది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని తుపాకీతో కాల్చి చంపారు.మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

నజఫ్‌గఢ్‌ ప్రాంతంలో మోహిత్‌ ఓ ఫొటో స్టూడియోకు వెళ్లినప్పుడు ఈ దారుణం జరిగింది. అతను షాపు ముందున్న సోఫాలో కూర్చుని ఉండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి మోహిత్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. అయితే ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయింది. ఇద్దరు దుండగులు తమను ఎవ్వరూ గుర్తుపట్టకుండా హెల్మెట్‌ ధరించారు.

మరో వ్యక్తి ముఖం మాత్రం ఫుటేజ్‌లో స్పష్టంగా తెలుస్తోంది. మోహిత్‌ శరీరంలో 13 బుల్లెట్లు దిగినట్లు పోలీసులు వెల్లడించారు. మోహిత్‌కు ఈ హంతకుల గ్యాంగ్‌తో గొడవలున్నాయా? లేక మరేదన్నా కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం కోసం అతని టిక్‌టాక్‌ వీడియోలు, కాల్‌ రికార్డింగ్స్‌ పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో విషయం ఏంటంటే.. స్థానిక ద్వారకా మోర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఇద్దరు క్రిమినల్స్‌ హత్యకు గురయ్యారట. ఈ ఘటన జరిగిన తర్వాత మోహిత్‌ హత్యకు గురికావడం గమనార్హం.