Crime:దారుణ ఘటన.. నడిరోడ్డుపైనే యువకుడిని దారుణంగా కత్తులతో నరికి చంపిన దుండగులు..?

Crime: ప్రస్తుత సమాజంలో రోజురోజుకీ మానవత్వం మంటగలిసి పోతుంది. ఒక మనిషి సాటి మనిషిని ప్రేమించాల్సింది పోయి అత్యంత దారుణంగా కిరాతకంగా చంపుకోవడం కొట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. మానవత్వం అన్న మాట మరచి చంపడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాదులో చోటు చేసుకుంది. తాజాగా హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లోని మెట్రో పిల్లర్ 96 వద్ద కొందరు దుండగులు ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా కత్తులతో నరికి చంపేసి అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

చనిపోయిన వ్యక్తి చంద్రాయన గుట్టలోని షాహీన్ నగర్ కు చెందిన జహంగీర్ అనే 22 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. స్థానికంగా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్యకు గల కారణాలను విచారిస్తున్నారు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.