తెలుగు సీనియర్‌ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ మృతి

తెలుగు సినిమా క్యారక్టర్ ఆర్టిస్ట్ సుభాష్ చంద్ర బోస్ మృతి చెందారు. . కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ కృష్ణానగర్‌లో ఉంటున్న సుభాష్‌చంద్రబోస్‌ ఈ నెల 24న ప్రమాదవశాత్తు కిందపడ్డారు. దీంతో ఆయన తలలో రక్తం గడ్డకట్టింది.

బోస్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోపోవడంతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందిన బోస్ ఆదివారం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ లోని ఓ ప్రెవేట్ హాస్పటిల్ లో ఆయనకు ట్రిట్మెంట్ చేసారు. ఆయన తర్వాత రీసెంట్ గా గాంధీ హాస్పటిల్ లోని ఐసియుకు షిప్ట్ చేసారు.

ఆ తర్వాత అక్కడే పరిస్దితి విషమించటంతో మృతి చెందారు. దాదాపు మూడు దశాబ్ధలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బోస్‌, ఎన్నో సూపర్‌ హిట్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. సుమన్‌ హీరోగా తెరకెక్కిన సాహసపుత్రుడు సినిమాతో తెరకు పరిచయం అయిన బోస్‌కు ప్రేమఖైదీ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ప్రేమ ఖైదీ, నిన్నే పెళ్లాడతా, ఇడియట్, ప్రేమించి చూడు వంటి అనేక చిత్రాలు చేసారు. పూరి జగన్నాథ్, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించారు. అవి మంచి పేరు తెచ్చి పెట్టాయి.