ఆ టైమ్ లో డ్రగ్స్ తీసుకుంది..ఆమె అసలు బాగోతం అదే

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా  గత కొన్ని రోజుల నుంచి కాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే . బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడించి షాక్ ఇచ్చిన తను శ్రీ  రీసెంట్ గా  ఓ ప్రముఖ డైరెక్టర్‌ వివేక్ అగ్నిహోత్రి  కూడా తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ వెల్లడించింది. అయితే ఆ సమయంలో బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్‌, సునీల్ శెట్టి తనను రక్షించారని చెప్పింది. కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై కూడా సంచలన ఆరోపణలు చేసింది.

 అవన్నీ ప్రక్కన పెడితే… ఈ వివాదంలో పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తనుశ్రీకి మద్దతు పలకారు. అయితే వివాదాస్పద నటి రాఖీ సావంత్ మాత్రం తనుశ్రీపై పలు ఆరోపణలు గుప్పించింది. ఆ సంఘటన జరిగిన రోజు …తనుశ్రీ డ్రగ్స్ తీసుకుని వ్యాన్‌లో ఉండగా, తాను నానా పాటేకర్ సలహా మేరకు ఆ  సాంగ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

రాఖీ  మీడియాతో మాట్లాడుతూ ‘ ఆ సమయంలో  తనుశ్రీ డ్రగ్స్ తీసుకుని వ్యాన్‌లో 4 గంటల పాటు స్పృహ లేకుండా వుంది. ఈరోజు పెద్దపెద్ద కబుర్లు చెబుతున్న తనుశ్రీ అసలు విషయం  బయపెట్టాలనుకుంటున్నా. ఆ పాట నేను పూర్తి చేసినందుకు తనుశ్రీ నాకు నోటీసు కూడా పంపించింది. అయితే సినిమా యూనిట్ నన్ను కాపాడింది’ అని  ఆమె తెలిపారు.

 ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ తనుశ్రీ..   రాఖీపై తనుశ్రీ రూ. 10 కోట్ల మేరకు పరువునష్టం దావా వేశారు.