సినిమాల‌కు గుడ్ బై చెప్పేస్తా: తాప్సీ

రంగోలీ టార్చ‌ర్ భ‌రించ‌లేక‌పోతున్నా!

గ‌త కొన్ని రోజులుగా కంగ‌న రనౌత్ సోద‌రి రంగోలీ చందేల్‌కు తాప్సీకి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఆమె టార్చ‌ర్ ని భ‌రించ‌లేక తాప్సీ ఏకంగా సినిమాల‌కు గుడ్ బై చెప్పేస్తాన‌ని స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం బాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారింది. తాప్సీ న‌టిస్తున్న తాజా చిత్రం `సాండ్ కీ ఆంఖ్‌`. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ కు చెందిన షూట‌ర్ దాదీస్ చంద్రో తోమ‌ర్‌, ప్ర‌కాషీ తోమర్‌ల జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని అనురాగ్ క‌శ్య‌ప్ నిర్మించాడు. తుషార్ హీరానందాని ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 25న దీపావ‌ళికి సంద‌డి చేయ‌నుంది.
 

అయితే త ఆ చిత్రంలో తాప్సీ పోషించిన పాత్ర కోసం ముందు ద‌ర్శ‌కుడు కంగ‌న‌ను సంప్ర‌దించాడ‌ట‌. అయితే అది వ‌య‌సు మ‌ళ్లిన వాళ్లు చేయాల్సిన పాత్ర అని, అందులో నీనా గుప్తా లాంటి వాళ్లు న‌టిస్తే బాగుంటుంద‌ని సూచించింద‌ట‌. కంగ‌న మాట‌ల్ని ప‌ట్టించుకోని మేక‌ర్స్ తాప్సీ, భూమి ప‌డ్నేక‌ర్‌ల‌తో రూపొందించారు. ఇది కంగ‌న సిస్ట‌ర్ రంగోలి చందేల్‌కు ఆగ్ర‌హాన్ని తెప్పించింది. దీంతో తాప్సీని టార్గెట్ చేయ‌డం మొద‌లుపెట్టింది. రంగోలి టార్చ‌ర్ మ‌రీ ఎక్కువ కావ‌డంతో మ‌న‌స్థాపానికి గురైన తాప్సీ యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పేస్తాన‌ని స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.
నా కెరీర్‌లో విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించాను. అలా న‌టించ‌కూడ‌దంటే ఎలా?. న‌టి అన్నాక అన్ని ర‌కాల పాత్ర‌ల్లో న‌టించాలి. 60 ఏళ్ల వ‌య‌సు మ‌ళ్లిన పాత్ర‌ల్లో న‌టించ‌డం అంత ఈజీ కాదు. అయినా మా వంతు ప్ర‌య‌త్నించాం. దానికి అభినందించ‌డం పోయి విమ‌ర్శ‌లా? అంటూ తాప్సీ రంటోలికి కౌంట‌రిచ్చే ప్న‌య‌త్నం చేసింది. తాప్సీ కౌంట‌ర్‌కు రంగోలీ ఏ స్థాయిలో జ‌వాబు చెబుతుందో, ఏ స్థాయిలో ర‌చ్చ చేస్తుందో చూడాల‌ని బాలీవుడ్ మేక‌ర్స్ అంటున్నారు.