అమలాపాల్ కు ఫోన్ చేసి దర్శకుడు తిట్లు,బెదిరింపు

                                                                    (సూర్యం)

మీటూ ఉద్యమం విశ్వరూపం ఇప్పుడు తమిళనాట కనపడుతోంది. బాలీవుడ్ లో మొదలైన ఈ  ఉద్యమం కోలివుడ్ లోనూ తన ప్రతాపం చూపెడుతోంది. పెద్ద పెద్ద వాళ్ల గుండెళ్లో రైళ్లు పరుగెట్టిస్తోంది.  ఈ నేపధ్యంలో ప్రముఖ తమిళ దర్శకుడు సుశీ గణేషన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మహిళా  దర్శకురాలు లీనా..సుసి గణేశన్‌ తనను వేధించినట్లు మీడియా ద్వారా తెలియచేసారు.

ఈ విషయమై  అమలా పాల్‌ స్పందిస్తూ ఈ విషయంలో లీనాకు తాను పూర్తి మద్దతిస్తానని తెలిపారు. సుసి గణేశన్‌ తన పట్ల కూడా ఇలాగే ప్రవర్తించారని ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు.  సుసి గణేశన్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని అన్నారు నటి అమలా పాల్.  అయితే ఆమె ఇలా పోస్ట్ పెట్టిన వెంటనే సుసి గణేషన్ ఆయన భార్య లైన్ లోకి వచ్చారు. తిట్లు అందుకున్నారు. ఫోన్ చేసి బెదిరించటం మొదలెట్టారు. ఈ విషయాన్ని సైతం అమలాపాల్ బయిటపెట్టింది.

 

అమలా పాల్ తన పోస్ట్ లో … ‘సుసి గణేశన్‌ దర్శకత్వం వహించిన ‘తిరుటుపాయలే 2’ చిత్రంలో నేను హీరోయిన్ గా నటించాను. ఆ సమయంలో  డబుల్ మీనింగ్ డైలాగులు అనేవాడు. అవసరంలేకపోయినా ఆఫర్ ఇవ్వాలని చూసేవాడు. అతని ప్రవర్తనతో షూటింగ్ టైమ్ లో చాలా ఇబ్బందులు పడ్డా.   మన భావితరాలు ఇలాంటి సంఘటనలు ఎదుర్కోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను’ అని అమలా పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌ పెట్టిన కొద్దిసేపటికి సుసి గణేశన్‌, అతని భార్య మంజరి అమలాకు ఫోన్‌ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడారంటూ ఆమె మరో పోస్ట్ పెట్టింది. ‘ఇప్పుడే నాకు షాకింగ్‌ సంఘటన ఎదురైంది. సుసి గణేశన్‌, అతని భార్య మంజరి నాకు ఫోన్‌ చేశారు. జరిగిన విషయాన్ని చెప్పాలని ఫోన్‌ లిఫ్ట్‌ చేసి మాట్లాడాను. కానీ వారు నా మాట వినకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మరో షాకింగ్‌ విషయం ఏంటంటే.. మంజరి వెటకారంగా నవ్వుతూ నా వ్యక్తిత్వాన్ని తప్పుబడుతున్నారు. ఇలాంటివాటితో నన్ను  బెదిరించాలనుకుంటున్నట్లున్నారు..’ అని అమలా ట్విటర్‌ ద్వారా
వెల్లడించారు.