సుశాంత్ హ‌త్య‌.. సీబీఐ ద‌ర్యాప్తు చేయాలన్న మేన‌మామ‌

అనూహ్య ప‌రిణామ‌మిది. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 34 ఏళ్ల నటుడి మృతి బాలీవుడ్ లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఈ మ‌ర‌ణానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు పోలీసు కమిషనర్ మనోజ్ శర్మ తెలిపారు.

తన మేనల్లుడు ఆకస్మిక మరణంపై సుశాంత్ మేన‌మామ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పిఎం నరేంద్ర మోడీ స్వ‌యంగా సీబీఐ దర్యాప్తు జ‌రిపించాల‌ని విజ్ఞప్తి చేశారు. కేవ‌లం మేన‌మామ మాత్ర‌మే కాదు.. ఆయ‌న అభిమానులు ఇదే కోరుతున్నారు.

ఇది హత్య కేసు. హ‌త్య‌నా? ఆత్మ‌హ‌త్య‌నా తేల్చాలి అంటూ బీహార్ కి చెందిన‌ రాజ్‌పుత్ మహాసభ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై సిబిఐ విచారణను కోరుతున్నారు. ఈ హత్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ స్వ‌యంగా సీబీఐ విచారణ చేయించాల‌ని మేము కోరుతున్నాం.. అంటూ ఈటీవీ భార‌త్ లో క‌థ‌నం వెలువ‌డింది.