సుశాంత్ సింగ్‌ని కొట్టి చంపారిలా.. అటుపై పోలీస్ కుట్ర‌!

సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలక మలుపు.. ఆనందంలో కుటుంబ సభ్యులు

                               ట్విట్ట‌ర్‌లో హ‌ల్చ‌ల్ చేస్తున్న వీడియో సెన్సేష‌న్

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ని హ‌త్య చేశారా?  ముంబై మాఫియాని కాపాడేందుకు పోలీసులే రికార్డులు మార్చేశారా? అంటే అవుననే ప్రూఫ్ ట్విట్ట‌ర్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. తాజాగా రక్షణ శాఖ ఆర్డినెన్స్ ఆసుపత్రిలో పని చేసే ప్రముఖ డెర్మటాలజిస్ట్ మీనాక్షి మిశ్రా సుశాంత్ మృతిపై ఓ సంచలన వీడియోను రిలీజ్ చేశారు. ఇది ఆత్మ‌హ‌త్య కాదు. మ‌త్తు ఇచ్చి కొట్టి చంపేశారు అంటూ ఆమె ఆరోపించారు. పోలీసులు ఈ కేసులో అన్ని రికార్డులు మార్చేశారు. ఫోరెన్సిక్ రిపోర్టుల్లోనూ త‌ప్పిదం ఉంద‌ని తెలిపారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని.. హత్యేన‌ని ఆరోపించారు ఆమె.

ఇక తాజాగా ఆమె విడుద‌ల చేసిన వీడియో చూస్తుంటే అందులో సుశాంత్ ముఖంపై గాయం క‌నిపిస్తోంది. గ‌ట్టిగా కొట్టిన‌ప్పుడు వ‌చ్చే మ‌చ్చ క‌నిపిస్తోంది. శ‌రీరంపై ఇతర భాగాల్లో గాయాలున్నాయని.. అతన్ని కొట్టి చంపి.. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారని మీనాక్షి మిశ్రా ఆరోపించ‌డం తాజాగా సంచ‌ల‌న‌మైంది.

నిజానికి సుశాంత్ సింగ్ ని చంపేశార‌ని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తొలి నుంచి వాదిస్తున్నారు. రియా చ‌క్ర‌వ‌ర్తిపై సుశాంత్ కుటుంబీకులు కేసులు పెట్టారు. ముంబై పోలీసుల విచార‌ణ‌పై బిహారీ పోలీసులు ప‌లు సందేహాల్ని వ్య‌క్తం చేస్తున్నారు. సుశాంత్ సింగ్ బ్యాంక్ ఖాతా నుంచి 50కోట్లు మాయ‌మ‌వ్వ‌డం ప‌లు సందేహాల‌కు తావిస్తోంది. ఇక రిప‌బ్ల‌క్ టీవీ అర్నాబ్ గోస్వామి సంచ‌ల‌న క‌థ‌నాలు బాలీవుడ్ వ‌ర్గాల్ని వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

https://twitter.com/DevangVDave/status/1290358169160445958