సుశాంత్ వ‌ర్సెస్ రియా: మంచు లక్ష్మి అర్ధం చేసుకుంది .. బాలీవుడ్ అర్ధం చేసుకోలేకపోయింది!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య అనంత‌ర ప‌రిణామాలు తెలిసిందే. అది హ‌త్య అని ఒక వ‌ర్గం ఆత్మ‌హ‌త్య అని ఒక వ‌ర్గం వాదిస్తూ సోష‌ల్ మీడియాల్లో డిబేట్లు పెట్ట‌డం సంచ‌ల‌న‌మైంది. ఇక సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిపైనా.. ఆమె కుటుంబంపైనా మీడియా వ‌రుస క‌థ‌నాలు తెలిసిందే. ప్ర‌స్తుతం రియా చ‌క్ర‌వ‌ర్తిని సీబీఐ విచారిస్తోంది. ఇప్ప‌టికే నాలుగోరోజు విచార‌ణ కొన‌సాగుతోంది.

manchu lakshmi wishes media to be with patience till rhea gets judgement
manchu lakshmi wishes media to be with patience till rhea gets judgement

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌న.. సుశాంత్ మాజీ ప్రేయ‌సి అంకిత లోఖండే స‌హా సుశాంత్ కుటుంబ స‌భ్యులు రియానే దోషి అంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఒక సెక్ష‌న్ మాత్రం రియా దోషా నిర్ధోషా అన్న‌ది సీబీఐ కోర్టులు చెప్పాలి. అప్ప‌టివ‌ర‌కూ ఆమెను.. ఆ కుటుంబాన్ని హింసించ‌డం స‌రికాదు అంటూ సేవ్ రియా! అన్న నినాదాన్ని తెర‌పైకి తెచ్చారు.

తాజాగా టాలీవుడ్ న‌టి మంచు ల‌క్ష్మి నుంచి రియాకు మ‌ద్ధ‌తు ల‌భించింది. రియాను రాక్ష‌సిని చేస్తూ మీడియా ప్ర‌చారం చేసింది. అయితే సుశాంత్ కేసులో నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌నే ఆశిస్తున్నాను. విచార‌ణ ముగిసే వ‌ర‌కూ ఓపిక ప‌ట్టాలి. రియాను దోషిని చేస్తూ దూషించ‌డం త‌గ‌దు! అంటూ మంచు ల‌క్ష్మి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ కేసు విష‌యంలో అప‌రాధి అయినా కాక‌పోయ‌నా రియా ఆమె కుటుంబం మీడియా వ‌ల్ల క్షోభ‌కు గుర‌వుతుండ‌డం బాధిస్తోంద‌ని ఆవేద‌నను వ్య‌క్తం చేశారు మంచు ల‌క్ష్మి. తాను కోరుకున్న‌ట్టే సుశాంత్ కి అత‌డి కుటుంబానికి రియాకు న్యాయం జ‌ర‌గాల‌నే ఆకాంక్షిద్దాం. నిజం నిగ్గు తేలాల‌ని కోరుకుందాం.