సూర్య వ్యాఖ్యలపై తమిళనాడు లో పెద్ద దుమారం !

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న నూతన విద్యావిధానంపై నటుడు సూర్య చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కొందరు రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండిస్తుండగా, మరి కొందరు స్వాగతిస్తుండటం విశేషం. ఇంతకీ నటుడు సూర్య చేసిన వ్యాఖ్యలను చూస్తే.. ఇటీవల శివకుమార్‌ విద్యా ట్రస్టు, సూర్య అగరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత పొందిన 10వ తరగతి పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సూర్య కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా అమల్లోకి తీసుకురానున్న విద్యావిధానంపై çఘాటుగా విమర్శించారు. నీట్‌ పరీక్షల విధానాన్ని ఖండించారు.

సూర్యకేం తెలుసు ?
రాష్ట్ర మంత్రి కడంబూరు రాజును నటుడు సూర్య వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా మీడియా ప్రశ్నించగా విద్యావిధానంపై నటుడు సూర్యకు ఏం తెలుసని అన్నారు. ఏదీ పూర్తిగా తెలియకుండా అరకొరగా మాట్లాడేవారి కంటే పూర్తిగా తెలిసిన వారికైతే బదులివ్వవచ్చునన్నారు. కాగా సూర్యకు రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు ఆయనకు అలాంటి ఆలోచన లేదని అన్నారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంపై సూర్య చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.