సుక్కు ధాయిలాండ్ సిట్టింగ్…సక్సెస్

పూరి జగన్నాధ్ కు బ్యాంకాక్ వెళ్లి కథలు రాయటం అలవాటు. ఇక్కడ ఉంటే ఏదో ఒక డిస్ట్రబెన్స్. అదే బ్యాంకాక్ లో మన పని మనం చేసుకోవచ్చు. మనని పట్టించుకునేవారు ఉండరని ఆయన నమ్ముతాడు. అందుకు తగినట్లే అనేక అద్బుతమైన స్క్రిప్టులు బ్యాంకాక్ లో రాసి భాక్సాఫీస్ రికార్డ్ లు క్రియేట్ చేసారు. ఇప్పుడు సుకుమార్ సైతం అదే దారిలో ప్రయాణం పెట్టుకున్నారు. ఆయన తన తాజా చిత్రం స్క్రిప్టు వర్క్ డిస్కషన్స్ ధాయిలాండ్ లో పెట్టారు. అక్కడే స్క్రిప్టు పూర్తి చేసుకుని వచ్చి మహేష్ ని ఒప్పించారు. ఇది హిట్ అయితే సుక్కూ ధాయిలాండ్ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తారనటంలో సందేహం ఏముంది అంటున్నారు సినిమా జనం.

2014లో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం `వ‌న్‌-నేనొక్క‌డినే`.భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఎవరికి వాళ్లు హిట్స్ కొట్టారు. ముఖ్యంగా రంగస్దలం సూపర్ హిట్ తో సుకుమార్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. దాంతో త్వ‌ర‌లో మ‌రోసారి వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమాకు రంగం సిద్దమైంది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌బోతోంది.

సుకుమార్ రీసెంట్ గా ..థాయిలాండ్ వెళ్లి స్కోరీ డిస్కషన్స్ జరిపి హైదరాబాద్ వచ్చారు. మహేష్ కు నేరేట్ చేసారు. కథ నచ్చిన మహేష్ వెంటనే ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే మార్చి నుంచి ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. 2109 డిసెంబ‌ర్‌లో లేదా 2020 ప్రారంభంలో సినిమా విడుద‌ల చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సినిమా త‌ర్వాత మ‌హేష్ త‌న 26వ చిత్రాన్ని సుకుమార్‌తో చేయ‌నున్నాడు. వ‌రుస హిట్స్ ఇస్తున్న మైత్రి మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌లో ఈ చిత్రం రూపొంద‌నుంది. ఈ ప్రాజెక్ట్ కోసం సుకుమార్ ఏకంగా 15 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకోబోతున్న‌ట్టు స‌మాచారం. తాజాగా ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు మొద‌లు పెట్టిన‌ సుక్కూ 2019లో మూవీ విడుద‌ల చేయ‌నున్నాడట‌. సంగీత ద‌ర్శ‌కుడిగా మ‌రోసారి త‌న సినిమాకి దేవి శ్రీ ప్రసాద్‌ని ఎంపిక చేశాడ‌ని తెలుస్తుంది.

త‌న తాజా చిత్రంలో న‌టీన‌టులు, టెక్నీషియన్స్ ని కూడా ఎంపిక చేసే ప‌నిలో ఉన్నాడు సుకుమార్‌. రంగ‌స్థ‌లం చిత్రం వంటి భారీ హిట్ ఇచ్చిన సుకుమార్ మ‌రీ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా త‌న త‌దుప‌రి సినిమాని మొద‌లు పెట్ట‌డం విశేషం. మ‌హేష్ 26వ చిత్రంగా రానున్న ఈ సినిమా అభిమానుల‌కి పసందైన విందు అందించే విధంగా ఉంటుంద‌ని అంటున్నారు. మ‌హేష్-సుకుమార్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన 1 నేనొక్క‌డినే చిత్రం భారీ డిజాస్ట‌ర్ కావ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడ‌ట సుకుమార్‌.