త్వరలోనే సెట్స్ పైకి సుకుమార్-బన్నీ సినిమా

అల్లు అర్జున్, సుకుమార్ మళ్ళీ కలిసి పని చేయనున్నారు. ఆ సినిమా కూడా ఈ నెల్లోనే ప్రారంభం అవ్వనుంది. త్వరలోనే సినిమా ప్రారంభం అయ్యే రోజును ప్రకటించనున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్. అలాగే ఈ సినిమాకి దేవి శ్రీ సంగీతం అందించనున్నారు.

అసలైతే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కావలి కానీ కొంచెం ముందే మొదలు పెడుతున్నారు నిర్మాతలు. ఎర్ర చందనం స్మగ్గ్లింగ్ నేపధ్యంలో ఈ చిత్రం ఉంటుందట, అంతే కాదు అల్లు అర్జున్ ఇంతకు ముందెన్నడూ చూడని ఒక కొత్త అవతారం కనిపిస్తారట. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుండి మొదలు కానుంది.