రజనీ కుమార్తెకు మళ్లీ పెళ్లి, పిభ్రవరిలో ఆ నటుడుతో

సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్ మళ్లీ పెళ్లి చేసుకోబోతోంది. సినీ నటుడు, ఓ ఫార్మా కంపెనీ యజమాని అయిన విషగన్‌ వనగమూడిని సౌందర్య పెళ్లాడబోతున్నారని తమిళ సిని వర్గాల సమాచారం. క్రితం సంవత్సరమే…సన్నిహితులు,ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఫిబ్రవరి 11న పెళ్లి జరగనున్నట్లు తమిళ సినీ వర్గాల సమాచారం.

చెన్నైలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వీరి వివాహాన్ని గ్రాండ్‌గా జరిపించనున్నట్లు తెలుస్తోంది. మెహెందీ, సంగీత్‌ కార్యక్రమాలతో కలిపి మూడు రోజుల పాటు వివాహ వేడుక ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి.ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులుకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్ళాయి.

అలాగే రజనీ నివాసంలో పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. ‘వంజగర్‌ ఉళగమ్‌’ అనే చిత్రంలో విషగన్‌ నటించారు. 2010లో సౌందర్య.. అశ్విన్‌ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు ఉన్నారు. పర్శనల్ కారణాల వల్ల 2017లో సౌందర్య, అశ్విన్‌ విడాకులు తీసుకున్నారు.