సుశాంత్ పై కుట్ర.. ద‌ర్శ‌క‌నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

యువ‌హీరో సుశాంత్ సింగ్ మృతిపై బాలీవుడ్ లో అన్ని వ‌ర్గాల నుంచి సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అత‌డిపై ఒత్తిడికి కార‌ణం ప‌రిశ్ర‌మ‌లో ర‌క‌ర‌కాల కుట్ర‌లు అన్న వాద‌న బ‌ల‌ప‌డుతోంది. తాజాగా సుశాంత్ తో పానీ చిత్రాన్ని తెర‌కెక్కించి భంగ ప‌డ్డ‌ దర్శక, నిర్మాత శేఖర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణమైన వ్యక్తులు తనకు తెలుసు అంటూ ఆయ‌న‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో కలకలం రేపుతోంది. సుశాంత్ పై ప‌రిశ్ర‌మ‌లో ఏదో కుట్ర జ‌రిగింది. అత‌డు ఎద‌గ‌కుండా కొన్ని శ‌క్తులు అడ్డు ప‌డ్డాయ‌ని అత‌డి వ్యాఖ్య‌లు స్ప‌ష్టంగా చెబుతున్నాయి.

“సుశాంత్ నువ్వు పడ్డ బాధ తెలుసు. నిన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తుల గురించి తెలుసు. వారి చర్యలను భరించలేక నువ్వు నా భుజాలపైపడి కన్నీరు పెట్టుకున్నావు. 6 నెలల నుంచి నేను నీకు దగ్గరగా ఉండి ఉన్నా లేదా నువ్వు నన్ను కలిసి ఉన్నా బాగుండేది. నీకు ఇలా జరగడం వారి కర్మ.. నీది కాదు సుశాంత్“ అని శేఖర్ కపూర్ ట్వీట్ చేశారు.