పల్స్ రేటు పెంచుతున్న సాహో!

పల్స్ రేటు పెంచుతున్న సాహో!

 
విడుదల దగర్గ పడుతోన్నకొద్దీ సాహో చిత్రం  పల్స్ రేటు పెంచుతోంది.  ప్రభాస్ ఫ్యాన్స్‌ను సంతృప్తిపర్చేందుకు చిత్రబృందం సైతం.. రోజుకో అప్‌డేట్‌తో ప్రమోషనల్ టెంపర్ కంటిన్యూ చేస్తోంది. తాజాగా ఓ రొమాంటిక్ పోస్టర్ విడుదల చేసి ఫ్యాన్స్‌కు ఫీస్ట్ చేసిన సాహో టీం -ముందే ప్రకటించినట్టు గంటల వ్యవధిలోనే సెకెండ్ సింగిల్ టీజర్ వదిలి హార్ట్ బీట్ పెంచింది.
 
ప్రభాస్, శ్రద్ధాకఫూర్ ఆర్తిగా కౌగిలించుకున్న రొమాంటిక్ పోస్టర్‌ని డార్లింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో చూపిస్తే, -శ్రవణానందమైన సాహో ‘లవ్ యాంథమ్’ టీజర్‌ను చిత్రబృందం బయటికొదిలింది. ఆస్ట్రియాలోని ప్రఖ్యాత ఆల్ఫ్స్ పర్వతాల బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్ స్టయిల్‌గా నడుచొస్తూ -నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే/ నీ కన్నులు అలిసేలా నీక్కనిపిస్తాలే అంటూ శ్రద్ధాకఫూర్‌ను ఇంప్రెస్ చేసేందుకు పాడే మెలోడీ ఇది.
 
‘ఏ చోట నువ్వున్నా’ అంటూ సాగే సాంగ్ టీజర్‌తోనే మురిపించిన చిత్రబృందం -పూర్తి పాట కోసం ఆగస్టు 2వరకూ వెయిట్ చేయమంటూ ప్రకటించింది. ‘హాయ్ డార్లింగ్స్.. సాహో సెకెండ్ సాంగ్ టీజర్‌ను టేస్ట్ చేయండి’ అంటూ ప్రభాస్ ఇన్‌స్టాగ్రాంలో  పెట్టిన పోస్టర్‌కే ఫ్యాన్స్ ఫిదా అవుతుంటే, ఈ మెలొడీతో మరింత కిక్కును ఎంజాయ్ చేస్తున్నారు.
 
తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ సెకెండ్ సింగిల్ టీజర్‌ను ఏకకాలంలో విడుదల చేశారు. సాహో నుంచి ఇప్పటికే విడుదలైన ‘సైకో’ సాంగ్ వెర్రెత్తించటం తెలిసిందే. దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. జిబ్రాన్ సంగీత హోరులో సాహో ఆగస్టు 30న థియేటర్లకు రానున్నాడు. ఏదిఏమైనా పల్స్ రేటు పెంచుతున్న సాహో! గురించి ఇప్పుడంతా జోరుగా ప్రచారం సాగుతోంది. చూద్దాం..  ఈ చిత్రం ఎలాంటి  సంచలనాన్ని సృష్టిస్తుందో?