పవన్,రేణు పిల్లలు పెద్దోళ్లు అయ్యారు (లేటెస్ట్ ఫొటో)

కొద్ది నెలల క్రితం వరకూ రేణూ దేశాయ్ తన పిల్లలను సోషయ్ మీడియాకు దూరంగా ఉంచింది. ముఖ్యంగా ఆమె ద్వితీయ వివాహం చేసుకున్నప్పుడు సోషల్ మీడియాలోవచ్చిన స్పందన చూసి.. పిల్లల ఫొటోలు అవి పెడితే వచ్చే ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని దూరం పెట్టారు. దాంతో ఈ మధ్యకాలంలో మీడియాలో పవన్ పిల్లల టాపిక్ లేదు.

అయితే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లున్నారు. తన పిల్లల ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇక్కడ ఆ ఫొటోని చూడవచ్చు. ఆ ఫొటోలో పిల్లలిద్దరూ పెరిగి పెద్దయ్యారు. బాబుకు 14 సంవత్సరాలు, పాపకు 10 ఏళ్లు వచ్చాయి.

పవన్‌తో కలిసి రేణు దేశాయ్ సహజీవనం చేయగా, వీరికి అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. పిల్లలు మాత్రం రేణూ వద్దే ఉంటూ వస్తున్నారు.

ఇక వివాహం అయినా … తన పిల్లల కోసం పవన్‌తో టచ్‌లో ఉంటానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె గతంలో సమాధానమిచ్చింది. ఆయన అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలకి తండ్రి. వారి భవిష్యత్ కోసం తప్పక టచ్‌లో ఉండాల్సిందే. సెలవులు వచ్చినప్పుడు, లేదా ఏవైన వేడుకలు ఉన్నప్పుడు అకీరా, ఆద్యాలు తప్పక ఆయన దగ్గరకు వెళతారు, నా వద్దకూ వస్తారు అని చెప్పుకొచ్చింది.