ప్రస్తుతం టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్లో కన్నడ సొగసరి రష్మిక మండన్న వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. తొలి కన్నడ చిత్రం `కిరాక్పార్టీ` సాధించిన సక్సెస్తో లైమ్లైట్లోకి వచ్చింది రష్మిక. అయితే ఆ సినిమాలో హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించింది. ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే ఎప్పుడైతే `ఛలో` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించిందో రష్మిక ఫేమ్ డబుల్ అయింది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమాలో నటించింది. అంతే కాకుండా విజయ్ దేవరకొండతోనే డియర్ కామ్రేడ్ అనే సినిమాలో కూడా నటిస్తుంది. ఇది కాకుండా దేవదాస్లో కూడా నాని జోడిగా నటిస్తుంది రష్మిక మండన్న. కెరీర్ ఇలా పీక్స్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే కెరీర్ పాడవుతుందని రష్మిక భావించి ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుందని వార్తలు వినపడుతున్నాయి. మరి దీనిపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి.
