రామ్ చరణ్ ఫేస్ బుక్ పై పోస్ట్ పై చర్చ మొదలెట్టేసారు

‘పరువు కోసం ప్రాణం తీసిన ఘటన ఎంతో బాధ కలిగించింది. మనిషి ప్రాణం తీయటంలో పరువు ఎక్కడుంది..? సమాజం ఎటు పోతుంది..?  ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు, అమృత వర్షిణికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ప్రణయ్‌కి న్యాయం జరగాలి’ అంటూ తన ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేశారు రామ్ చరణ్.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్యోదంతంపై సెలబ్రెటీలు, ప్రముఖులు కూడా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మంచు మనోజ్‌ , రామ్ చరణ్, రామ్  ఈ ఘటనను ఖండిస్తూ సోషల్‌ మీడియా ద్వారా మేసేజ్‌ చేశారు. అయితే మిగతా వారికి కౌంటర్స్ ఏమీ పెద్దగా లేవు కానీ … మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌  ఈ దారుణ ఘటనపై స‍్పందించిన విషయమై సోషల్ మీడియాలో చాలా మంది నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

రామ్ చరణ్ కుటుంబం కూడా అలా తమ ఇంటి ఆడపిల్లల ప్రేమలను ఏక్సెప్టు చేయలేదని, విడాకులు ఇప్పించి వేరే పెళ్లి చేసారని  అప్పుడు రామ్ చరణ్ ఎందుకు ఖండించలేకపోయారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.

అయితే చాలా మంది గుర్తించాల్సింది ఆ ఇష్యూ వేరు..ఇది వేరు. ఇక్కడ ఓ కుర్రాడు దారుణ హత్యకు గురి అయ్యారు. సామరస్య పూరిత వాతావరణం అనేది లేదు, అయినా చెర్రీ తన అభిప్రాయం తను చెప్పాడు..ప్రతీదానికి పెడర్దాలు తీస్తే కష్టం అంటూ మరికొందరు రామ్ చరణ్ ని సపోర్ట్ చేస్తున్నారు.