కమిడియన్ పృథ్వీ కామెంట్ కు రాజేంద్రప్రసాద్ కౌంటర్

కమిడియన్ పృథ్వీ కామెంట్ కు రాజేంద్రప్రసాద్ కౌంటర్

అత్యధిక మెజారిటీ సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ని అభినందించడానికి సినీ పరిశ్రమకి సంబందించిన ఎవరుకూడా రాలేదన్న విషయం తెలిసిందే. ఈ విషయమై సోషల్ మీడియాలో, మీడియాలో బహిరంగంగానే చర్చ జరిగింది. అంతేకాదు ఆ తర్వాత ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్, సినీ నటుడు పృథ్వి ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. అయితే ఆయన మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరూ స్పందించలేదు. నిజమే కదా..ఎవరు వెళ్లలేదు కదా అనుకున్నారు. కానీ తాజాగా పృథ్వీ చేసిన ఈ వ్యాఖ్యలకు సినీ నటుడు రాజేంద్రప్రసాద్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా, జగన్మోహన్ రెడ్డిని కలవడానికి సినీ నటులేమీ వ్యాపారవేత్తలు కాదని, అసలు ఇలా కలవాలన్న నిబంధన కూడా ఏమి లేదని రాజేంద్రప్రసాద్ అన్నారు. కాకపోతే ముఖ్యమంత్రిగా జగన్ సెటిల్ అయిన తర్వాత అందరు వెళ్లి కలుసుకొని, అన్ని విషయాలు ప్రస్తావిస్తామని రాజేంద్రప్రసాద్ తెలిపారు.

అలాగే ఇప్పటికి కూడా జగన్ తో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, రెండు రాష్ట్రాలకు సంబందించిన ముఖ్యమంత్రులిద్దరూ కూడా సినీ పరిశ్రమపై సానుకూలంగానే ఉన్నారని రాజేంద్రప్రసాద్ తెలిపారు. మరో రెండు రోజుల్లో జగన్ ని కలవనున్నారని, కానీ కొన్ని కారణాల వలన అది మరొక రెండు రోజులు పొడిగించడం జరిగిందని రాజేంద్రప్రసాద్ మీడియా కి తెలిపారు.