‘శేఖర్‌ బాబును ఎవరు చంపారు?’ తేలుస్తున్న రాజశేఖర్

యాంగ్రీ మ్యాన్‌ రాజ‌శేఖ‌ర్ న‌టించిన “క‌ల్కి” సినిమా ఈ వీకెండ్ విడుద‌ల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్ర‌యిల‌ర్స్‌, టీజ‌ర్స్‌తో క‌ల్కి సినిమా అంచ‌నాల‌ను పెంచేస్తోంది. ప్ర‌వీణ్ స‌త్తారు తీసిన “గ‌రుడ‌వేగ” సినిమాతో యాంగ్రీమేన్ రాజ‌శేఖ‌ర్ కొత్త తరానికి న‌చ్చాడు. ఇపుడు అదే పంథాలో వెళ్తూ క‌ల్కిని చేశారు.. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘ఆకాశవాణి.. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్‌బాబు దారుణ హత్య తర్వాత నర్సప్ప పెరుమాండ్ల వర్గీయుల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి’ అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ ఇంట్రస్టింగ్ గా మొదలైంది. మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

Kalki Honest Trailer | Dr Rajashekar | Adah Sharma | Prasanth Varma | Madhura Audio

ఈ మాటలు విన్న నటుడు రాహుల్‌ రామకృష్ణ.. ‘శేఖర్‌ బాబును ఎవరు చంపారు?’ అంటూ ఇంటింటికీ వెళ్లి ఆరా తీస్తుంటారు. ఈ హత్య కేసుపై ఎంక్వైరీ మొదలుపెడదాం అని రాజశేఖర్‌ చెప్పడం, ఈ నేపథ్యంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను టెన్షన్ గా చూపించారు.

‘హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు. యుద్ధం చేయాల్సింది మాత్రం రాముడే’ అని నాజర్‌.. రాజశేఖర్‌తో అనడంతో ఆయన కొడవలి పట్టి ఒక్కొక్కరినీ నరికే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. చివర్లో ‘చంపిందెవరో చెప్పాల్సింది నేను’ అని రాజశేఖర్‌ కోపంగా చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.