సాయి పల్లవి ఎదురుచూపులు ఎవ‌రికోసం ?

టాలీవుడ్ హంక్ రానా-సాయిప‌ల్ల‌వి జంట‌గా విరాట ప‌ర్వం ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన ద‌గ్గ‌ర నుంచే మంచి అంచ‌నాలేర్ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే న‌క్స‌లైట్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న‌ తొలి పోస్ట‌ర్ సినిమాపై అంచ‌నాల‌కు అంత‌కంత‌కు పెంచేసింది. రానా కెరీర్ లో మ‌రో డిఫ‌రెంట్ జోన‌ర్ చిత్ర‌మిది. యంగ్ డైరెక్ట‌ర్ వేణు ఉడుగుల చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తొలి సినిమా నీది నాది ఒకే క‌థ చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంలందుకున్న యంగ్ డైరెక్ట‌ర్ ట్యాలెంట్ చూసి రాని పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చిన సినిమా ఇది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. కొద్ది భాగం షూటింగ్ పూర్త‌యింది. ప్రస్తుతం లాక్ డౌన్ కార‌ణంగా చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డింది.

అయితే నేడు హీరోయిన్ సాయి ప‌ల్లవి జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా అమ్మ‌డి లుక్ ని రివీల్ చేసారు. ఇందులో సాయిప‌ల్లవి 1980 కాలం పాటి పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. లంగా వోణీ ధ‌రించి క‌మ్యునిస్ట్ పార్టీ అమ‌ర‌వీరుల స్మార‌క చిహ్నం వ‌ద్ద‌ ద‌గ్గ‌ర అమాయకంగా కూర్చొని ఎదురుచూస్త‌న్న‌ట్లు పిక్ లో రివీల్ చేసారు. నాటి కాలం అమ్మాయి చ‌దువుకుంటే ఎలా ఉంటుందో? అచ్చంగా అలాంటి వాత‌వ‌ర‌ణాన్ని క్రియేట్ చేసారు. సాయి ప‌ల్ల‌వి చేతిలో పెన్ను..వెనుక ల‌గేజీ బ్యాగ్ తో క‌నిపిస్తుంది. అలాగే కాళ్ల కింద అరిగిపోయిన చెప్పుల‌తో పిక్ లో రియాల్టీని చూపించే ప్ర‌య‌త్నం చేసారు. మ‌రి సొగ‌స‌రి ఎదుద‌రుచూపులు ఎవ‌రి కోస‌మో!

ఈ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ సినిమాలో ఇంకెన్ని ర‌కాల ట్విస్టులుంటాయో చూద్దాం. ఇందులో ప్రియ‌మ‌ణి ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. అమ్మ‌డి పాత్ర కూడా సినిమాలో హైలైట్ గా ఉంటుంద‌ని స‌మాచారం. ఇంకా నందితా దాస్, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్ త‌దిత‌లులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్- శ్రీల‌క్ష్మి వెంట‌కేశ్వ‌ర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా రాజీ లేకుండా నిర్మాణం జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.