మోహన్ లాల్ జాగ్రత్తగా మాట్లాడాలి : ప్రకాష్ రాజ్

‘మీటూ’ ఉద్యమానికి చాలామంది నటీనటులు మద్దతు తెలుపుతుంటే మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ మాత్రం ‘మీటూ’ను మూణ్ణాళ్ల ముచ్చటగా సంబోధించిన సంగతి తెలిసిందే. ‌. అయితే బహుబాషా నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఈ స్టేట్‌మెంట్‌తో ఏకీభవించలేదు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..‘‘మోహన్‌లాల్‌ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడి ఉంటారని నేను అనుకోను. ఆయన చాలా సున్నితమైన వ్యక్తి. కానీ ఇలాంటి విషయాలు మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి స్థాయి వ్యక్తి నుంచి సొసైటీ చాలా ఎక్స్‌పెక్ట్‌ చేస్తుంది’’ అన్నారు.

అలాగే మీటూ గురించి మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ ‘‘ఇలాంటి ఉద్యమాలు స్త్రీలను మరింత ధైర్యవంతులను చేస్తాయి. సాధికారత వైపు నడిచేలా చేస్తాయి. చాలా మంది, నాతో సహా ఏదో ఒక సమయంలో స్త్రీలపై తెలిసో, తెలియకో దాడి చేసి ఉండొచ్చు. స్త్రీలు లైంగిక వేధింపులకు గురైనప్పుడు మౌనంగా ఉన్నారంటే తప్పు చేసిన వాళ్లను ప్రోత్సహించినట్టే. ఈ విషయంలో వాళ్లు పడుతున్న బాధ నిజమైంది. మనం గుడ్డివాళ్లలాగా ప్రవర్తించొద్దు. ‘మీటూ’ లాంటి ఉద్యమాల్లోని లోతుని అర్థం చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు.

మోహన్ లాల్ ఏమన్నారంటే..

మోహన్‌లాల్‌ ‘మీటూ’ గురించి మాట్లాడుతూ..‘‘మలయాళ ఇండస్ట్రీలో ఎటువంటి సమస్యా లేదు. లైంగిక వేధింపులు ఎక్కడైనా జరుగుతాయి. కేవలం సినిమా ఇండస్ట్రీలో అని అనుకోవడం కరెక్ట్‌ కాదు. అయినా ‘మీటూ’ అనేది ఓ ఫ్యాషన్‌లా తయారైంది. ఇలాంటివి ఎక్కువ కాలం నిలబడలేవు. కేవలం మూణ్ణాళ్ల ముచ్చట అవుతాయి. అయినా ‘మీటూ’ మీద నేను కామెంట్‌ చేయలేను. దాన్ని అనుభవిస్తేగాని మాట్లాడకూడదు’’ అని పేర్కొన్నారు.