హ‌రిద్వార్ ఆశ్ర‌మంలో సామాన్యుడిలా జ‌న‌సేనాని

ప‌వ‌న్ ధామ్‌లో ప‌వ‌న మ‌హ‌ర్షి

గ‌త కొంత కాలంగా నిత్యం రాజ‌కీయాలు, రాజ‌కీయ స‌మావేశాలు, డిబేట్‌లు, సామాన్యుల స‌మ‌స్య‌లు… సినిమా ఫంక్ష‌న్‌లు… ఇలా క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపిన ప‌వ‌న్‌స్టార్, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ హ‌రిద్వారా రుషికేష్ కు వెళ్ల‌డం అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో స‌క‌ల సౌక‌ర్యాల‌తో రాజ‌భోగాలు అనుభ‌వించే అవ‌కాశం వున్నా వాట‌న్నింటినీ ప‌క్క‌న పెట్టి అతి సాధార‌ణ వ్య‌క్తిగా హ‌రిద్వారాలో ప‌వ‌న్ గ‌డుపుతున్న తీరు ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. `సైరా న‌రసింహారెడ్డి` ప్ర‌చారం పూర్త‌యింది మొద‌లు ప‌వ‌న్ ఇలా ధార్మిక ప‌ర్య‌ట‌న‌ను ఖ‌రారు చేశారు.

మానసిక‌ ప్ర‌శాంత‌త కోసం హ‌రిద్వారా రుషీకేష్ వెళ్లిన ప‌వ‌న్ అక్క‌డ ప‌వ‌న్ ధామ్‌లో అతి సాధార‌ణ రూమ్‌లో బ‌స చేసి చిన్న‌ బెడ్‌, ఓ మూల రెండు కుర్చీలు… కారిడార్‌లో ఓ చెక్క కుర్చీలో కూర్చుని ఓ బుక్‌ని చ‌దువుతూ అతి సాధార‌ణ వ్య‌క్తిలా గ‌డిపేస్తున్నారు. హ‌రిద్వార్ రుషికేష్ ట్రిప్‌లో ప్ర‌శాంత చిత్తుడైన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. ప్ర‌కృతిని ఆస్వాధిస్తూ యోగిని త‌ల‌పిస్తున్నాడు. ప‌వ‌న్ హ‌రిద్వార్ రుషికేష్‌కు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో వైర‌ల్‌గా మారాయి.

ప‌వ‌న్ సాధార‌ణ జీవితం గ‌డుపుతున్న ఫొటోలు చూసి మెగా ఫ్యాన్స్ అంతా త‌మ ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్త ప‌రుస్తున్నారు. ల‌గ్జ‌రీ జీవితాన్ని వ‌ద‌లేసి ఇలాంటి స్ల‌మ్ లైఫ్‌ని గ‌డుపుతున్నారంటే గ్రేట్ స‌ర్ మీరు అని కొంత మంది. స్ల‌మ్ ఏరియాలో మెట్ల‌పై కూర్చుని వున్న ఫొటోల‌ని చూస్తూ ఇంత సింప్లిసిటీ అయితే ఎలా బాస్.. అందుకే మీరు పీకే అని మ‌రి కొంత మంది ఇన్ స్టాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ప‌వ‌న్ ధామ్ ప‌క్క‌నే వున్న పిల్ల‌కాలువ ప‌క్క‌న వున్న మెట్ల‌పై అతి సామాన్యుడిగా ప‌వ‌న్ కూర్చుని క‌నిపిస్తున్న ఫొటోలు కూడా ఇన్ స్టాలో వైర‌ల్‌గా మారాయి.