అవి చూసి పోసానికు బాగా మండింది, దులిపేసాడు

అవి చూసి పోసానికు బాగా మండింది, దులిపేసాడు

అసలే పోసాని కృష్ణ మురళికు కోపం ఎక్కువ. ముక్కు సూటి తనం కూడా ఎక్కువే. దానికి తోడు ఈ మధ్యన రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. దాంతో ఆయన ఏదైనా విషయమై నిర్మొహమాటంగా మాట్లాడతారు. అలాంటిది తన విషయంలో ఎవరైనా తింగరిగా వాగితే తాట తీయరూ. ఇప్పుడు అదే చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే…గత కొద్ది ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి హెల్త్ కండీషన్ పై సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు వినిపిస్తున్నాయి…కనిపిస్తున్నాయి.హెల్త్ ప్లాబ్లంస్ తో ఆయన ఇటీవల ట్రీట్మెంట్ చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే చికిత్స తర్వాత పోసాని మరోసారి తీవ్ర సీరియస్ అయ్యిందని ప్రచారం జరిగింది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానెల్స్ లో అయితే ఈ వార్తకు మసాలా అద్ది మరీ దారుణంగా రాసేసారు. ఒక న్యూస్ ఛానెల్ అయితే ఈ విషయమై స్పెషల్ ప్రోగ్రామే చేసేసింది. ఇవన్నీ ఆయన సన్నిహితులను కంగారు పెట్టాయి.

దాంతో ఆయనకు వరస కాల్స్. అందరూ ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడుగుతున్నారట. దాంతో ఇక పోసానే డైరక్ట్ గా సీన్ లోకి రావాల్సిన పరిస్దితి వచ్చింది. అయితే ఈ వార్తల్ని పోసాని స్వయంగా ఖండించారు. ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి బాగుందని, త్వరలోనే షూటింగ్‌కు కూడా హాజరవుతానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

‘నా ఆరోగ్యం బాగోలేదని, విషమంగా ఉందని సోషల్‌మీడియాలో రాసినట్లు నా ప్రెండ్స్ చెప్పారు. నిజమే.. నా ఆరోగ్యం బాగోలేదు, కానీ చచ్చిపోయేంత కాదు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి నన్ను బతికించారు. పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిని చేశారు. కాబట్టి ఇక నా ఆరోగ్యం గురించి మీకు ఎలాంటి ఆలోచనలు వద్దు. మళ్లీ షూటింగ్‌కు వెళ్లబోతున్నా. త్వరలోనే మీకు తెరపై కనిపించబోతున్నా. నా ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న వారికి ధాంక్స్’ అని పోసాని చెప్పారు. అదీ మ్యాటర్.