పోకిరి సీక్వెల్ రెడీ అవుతుందా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ -పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన పోకిరి అప్ప‌ట్లో బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసిందో తెలిసిందే. టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు సాధించిన చిత్రం స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది. మ‌హ‌ష్ కెరీర్ లోనే ఓ మైలు రాయిగా నిలిచిపోయిన చిత్రం. ఆజాన‌ర్ సినిమా మ‌ళ్లీ చేయాలన్నా… మ‌ళ్లీ అలాంటి క‌థ పుట్టాలంటే పూరి నే పెన్ను పెట్టాలి. అలాంటి పెర్పామెన్స్ ఇవ్వాలంటే మ‌హేష్ దిగి రావాలి. తాజాగా ఆ స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌నే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా ఈ ద్వ‌యం పోకిరి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

ఇటీవ‌లే మ‌హేష్ పూరికి ఫోన్ చేసి మాట్లాడారుట‌. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇద్ద‌రి మ‌ధ్య చిన్న‌పాటి మ‌న‌స్ప‌ర్ధ‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఇద్ద‌రు కాస్త దూరంగా ఉన్నారు. ఇదే స‌మ‌యంలో మ‌హేష్ తో జ‌న‌గ‌న‌మ‌ణ సినిమా చేస్తున్న‌ట్లు పూరి ప్ర‌క‌టించాడు. కానీ మ‌హేష్ ఆ సినిమాకి డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. ఈ నేప‌థ్యంలో పూరి బాగా హ‌ర్ట్ అయ్యాడ‌ని ప్ర‌చారం సాగింది. అయితే తాజా కాల్ తో ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌త‌లు తొల‌గిపోయాయ‌ని..ఈ ద్వ‌యం మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేయాల‌నుకుంటున్న లీకైంది. దీనిలో భాగంగా పూరి ని పోకిరి సీక్వెల్ సిద్దం చేయ‌మ‌ని చెప్పాడుట‌.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను అన్వ‌యించుకుని స్ర్కిప్ట్ అదిరిపోయేలా ఉండాల‌ని….పోకిరి..బిజినెస్ మెన్ చిత్రాల‌ను కొట్టేలా స్ర్కిప్ట్ ఉండాల‌ని సూచించాడుట‌. పూరి కూడా త‌ప్ప‌కుండా చేద్దామ‌ని ప్రామిస్ చేసాడుట‌. అయితే అందుకు త‌న‌కు కొంచెం స‌మ‌యం కావాల‌ని…ప్ర‌స్తుతం వేర్వేరు క‌మిట్ మెంట్లతో బిజీ గా ఉన్నాన‌ని..అవి పూర్త‌యిన త‌ర్వాత స్ర్కిప్ట్ ప‌నులు మొద‌లు పెడ‌తాన‌ని చెప్పారుట‌. ప్ర‌స్తుతం పూరి విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఫైటర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత డార్లింగ్ ప్ర‌భాస్ తో ఓ సినిమా చేయ‌నున్నట్లు ప్ర‌చారంలో ఉంది. ఇది ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం జ‌రిగితే పూరి త‌ర్వాతి ఆప్ష‌న్ లో మ‌హేష్ ఉండే ఛాన్స్ ఉంది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా మ‌హామ్మారి కార‌ణంగా ప‌రిస్థితులు త‌ల్ల‌కిందులైన సంగ‌తి తెలిసిందే.