Aishwarya Rajesh: ఆరుగురు పిల్లల తల్లిగా నటించబోతున్న ఐశ్వర్య రాజేష్.. ఆ మూవీ ఏదో తెలుసా?

Aishwarya Rajesh: తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అచ్చ తెలుగులో మాట్లాడుతూ తన అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఇకపోతే ఇటీవల ఈ ముద్దుగుమ్మ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ ఏడాది ప్రారంభంలో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే. వెంకటేష్ సరసన భార్యగా, నలుగురు పిల్లలకు తల్లిగా నటించి అదరగొట్టింది. ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో అందర్నీ నవ్వించింది. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి, వెంకటేష్ కూడా ఈ సీక్వెల్ ఉంటుందని కంఫర్మ్ చేసారు. 2027 సంక్రాంతి పండక్కి సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అనే టైటిల్ తో సీక్వెల్ రాబోతుందని సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఐశ్వర్య రాజేష్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడుతూ..

అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ గురించి చెప్పారు. నేను సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నలుగురు పిల్లలకు తల్లిగా నటించాను. నాకు పిల్లలు అంటే ఇష్టం. సీక్వెల్ లో నాకు ఆరుగురు పిల్లలు ఉంటారు అని అనిల్ రావిపూడి గారు ఆల్రెడీ చెప్పారు అని తెలిపింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కూడా ఫుల్ కామెడితో థ్రిల్లింగ్ గా, ఐశ్వర్య పాత్ర కూడా ఇంకా అదిరిపోతుందని తెలుస్తోంది. అయితే పార్ట్ 1 సినిమాలో నలుగురు పిల్లలకు తల్లిగా నటించిన ఐశ్వర్య ఇప్పుడు ఆరుగురు పిల్లలకు తల్లిగా నటించడానికి సిద్ధమవుతోంది.