ప‌వ‌న్ కుమారుడు ప్రొడ్యూస‌ర్‌… కుమార్తె డిస్ట్రిబ్యూట‌ర్‌!

                                                                     (ధ్యాన్)  

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య‌గా రేణూదేశాయ్‌కి బోలెడంత గుర్తింపు. ముచ్చ‌ట‌గా మూడో పెళ్లి చేసుకుని ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆనందాల‌కు అవ‌ధుల్లేవు. అటు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఇటు రేణూదేశాయ్ నిర్ణ‌యాల వ‌ల్ల ఎవ‌రైనా ఇబ్బందిప‌డ్డారా? అంటే ముమ్మాటికీ పిల్ల‌లే. తెలుగునాట అఖీరా, ఆద్య గురించి ఆరా తీసేవారు, ఆలోచించేవారి సంఖ్య ఎక్కువే. త‌న వంతుగా రేణూ కూడా పెళ్లి చేసుకుంటున్న‌ప్ప‌టికీ పిల్ల‌ల స‌మ్మ‌తితోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతోంది. త్వ‌ర‌లో రైతుల స‌మ‌స్య‌ల‌తో ఆమె తెర‌కెక్కించే సినిమాను కొడుకు అఖీరా పేరు మీద నిర్మించ‌నుంది. అఖీరా ప్రొడ‌క్ష‌న్స్ కి సినిమా నిర్మాణం కొత్త‌కాదు. గ‌తంలో ఆమె నిర్మించిన `మంగ‌ళాష్ట‌క్‌` కూడా అదే బ్యాన‌ర్ మీద రూపొందింది. రెండో సినిమా కూడా అదే బ్యాన‌ర్‌లోనే తెర‌కెక్కింది. తాజాగా మూడో సినిమా తెలుగులోనూ అదే బ్యాన‌ర్ మీద రానుంది. ఆద్య పేరుతో ఓ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీని ప్రారంభించారు రేణూదేశాయ్‌. తెలుగులో ఆమె తెర‌కెక్కించే సినిమాను కూడా అదే కంపెనీ మీద పంపిణీ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. సో తెలుగులోకి అఫిషియ‌ల్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ కుమారుడు నిర్మాత‌గా, కుమార్తె డిస్ట్రిబ్యూట‌ర్‌గా తెరంగేట్రం చేయ‌నున్నార‌న్న‌మాట‌.