ప‌వ‌న్ -క్రిష్ పాన్ ఇండియా రేంజ్ లో?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న సినిమా పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్క‌నుందా? అంటే అవున‌నే స‌మాచారం అందుతోంది. మంగ‌ళ‌వార‌మే ప‌వ‌న్ క‌మ్ బ్యాక్ మూవీ పింక్ రీమేక్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ షూటింగ్ కి కూడా హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతోన్న హ‌డావుడి కాస్త ఓ కొలిక్కి రాగానే ప‌వ‌న్ రెగ్యుల‌ర్ గా షూట్ కి హాజ‌రుకానున్నారు. ఇక ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాకు క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఈనెల 27న సింపుల్ గా షూటింగ్ ప్రార‌భం కాబోతుంది. తాజాగా సినిమాకు సంబంధించిన మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్లో ప్లాన్ చేస్తున్నారుట‌. తెలుగు తో పాటు హిందీ ఇత‌ర భాష‌ల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారుట‌. పాన్ ఇండియా రేంజ్ స్ర్కిప్ట్ కావ‌డంతోనే ఈ సాహ‌సం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదో హిస్టారిక‌ల్ ఎమోష‌న్ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మ‌ట‌. అందుకే క్రిష్ ని అంత బ‌లంగా రంగంలోకి దింపారని వినిపిస్తోంది. ప‌వ‌న్ ఓ దొంగ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు అన్న వార్త ఇప్ప‌టికే వెడెక్కిస్తోంది. అలాగే ఇందులో ప‌వ‌న్ కు జోడీగా ఇద్ద‌రు హీరోయిన్ న‌టించ‌నున్నార‌ని స‌మాచారం.