ఉద్య‌మాల వేళ ప‌వ‌న్ రీఎంట్రీ క‌ష్ట‌మే!

పింక్ రీమేక్ తో ప‌వ‌న్ తిరిగి రీఎంట్రీ ఇస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. అయితే ప్ర‌స్తుత స‌న్నివేశంలో ఆయ‌న రీఎంట్రీ సాధ్య‌మా? అంటే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. దిల్ రాజు ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే మ‌రోవైపు ఈ నెల 20 నుండి సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుందని ప్ర‌చారం సాగుతోంది. పవన్ సైతం త్వరలోనే చిత్రీకరణలో పాల్గొంటార‌ని చెబుతున్నారు.

ఈ చిత్రాన్ని వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. హిందీ, తమిళ భాషల్లో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ ఆ స్థాయి విజ‌యం సాధించాలంటే స్థానిక‌తను దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కించాల్సి ఉంటుంది. ఇక ప‌వ‌న్ ఇప్పుడున్న టెన్ష‌న్స్ లో ఈ రీమేక్ లో న‌టించేందుకు రాగ‌ల‌రా లేదా? అన్న‌దానిపై సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఓవైపు అమ‌రావ‌తి రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లింపు వ్య‌వ‌హారం అంత‌కంత‌కు వేడెక్కిపోతోంది. ఈ ఉద్య‌మంలో పవ‌న్ భాగ‌మ‌య్యారు కాబ‌ట్టి ఏం జ‌ర‌గ‌నుంది? అన్న‌ది చూడాలి.